Read more!

English | Telugu

Guppedantha Manasu : మను తండ్రి ఎవరో ఆ బామ్మ చెప్పగలదా?

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1056 లో.. మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదనిపిస్తుందని మహేంద్రతో వసుధార అనగానే.. సరైనదే అని మహేంద్ర అంటాడు. మీరు ఒక కోణంలోనే ఎందుకు ఆలోచిస్తున్నారు? దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్ గురించి ఆలోచంచడం లేదని వసుధార అంటుంది. మన చుట్టున్న వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఆలోచిస్తే ఏం చెయ్యలేం.. అనుపమ నిజం చెప్పాలని ఇదంతా చేస్తున్నాను.. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు.. నేను మనుని దత్తత తీసుకోవడం తప్పా అని మహేంద్ర అడుగుతాడు.

తప్పేం కాదు మావయ్య కానీ సాయం చెయ్యడానికి దత్తత తీసుకోవల్సిన అవసరం లేదు కదా అని వసుధార అంటుంది. మను మనకి చాలా హెల్ప్ చేశాడు.. ఇంకా చేస్తున్నాడు.. మనుతో ఉంటే రిషితో ఉన్నట్లు అనిపిస్తుందని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత నాకు ఒక హెల్ప్ చేస్తావా అని వసుధారని మహేంద్ర అడుగగా.. ఏంటని వసుధార అంటుంది. ఈ దత్తతకి మనుని నువ్వే ఒప్పించాలని చెప్తాడు. మరొకవైపు రాజీవ్ తాళి పట్టుకొని తిరుగుతుంటాడు‌. ఇది ఎప్పుడు నా మరదలు మెడలో కడుతానోని రాజీవ్ అనుకుంటాడు. అప్పుడే వసుధార కార్ లో వెళ్తూ కన్పిస్తుంది. వసుధారని చూసిన రాజీవ్ హ్యాపీ గా ఫీల్ అవుతు.. ఇప్పుడే అనుకున్నాను ఇప్పుడే కన్పించావని.. వసుధార ఎక్కడకి వెళ్తుందోనని తన వెనకాలే వెళ్తాడు. మరొకవైపు మనుని వసుధార కలిసి మాట్లాడుతుంది. మీరేం నిర్ణయం తీసుకున్నారని మనుని వసుధార అడుగుతుంది. నేనేం నిర్ణయం తీసుకలేదు.. నాకు ఇష్టం లేదని మను చెప్తాడు. ఆ తర్వాత తన తండ్రి గురించి అమ్మ ఎందుకు చెప్పడం లేదని మను ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ మాటలన్నీ రాజీవ్ విని.. నా మరదలు బానే రాయభారాలు నడుపుతుందని అనుకుంటాడు.

ఆ తర్వాత అనుపమ దగ్గరకి వసుధార వెళ్తుంది. మను గారి బాధను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.. అయిన తండ్రి ఎవరో చెప్పండి అని వసుధార అడుగుతుంది. అసలు మీక్కూడా తెలియద అనగానే‌.. వసుధారని అనుపమ కోప్పడుతుంది. మరి చెప్పండి మను తండ్రి చనిపోయాడా అని అంటుంది.  వసుధారపై అనుపమ అరుస్తు.. ఇంకొక సారి అలా అనకంటూ కోప్పడుతుంది. మళ్ళీ మళ్ళీ అంటానని వసుధార అంటుంది. అప్పుడే అనుపమ వాళ్ళ పెద్దమ్మ వచ్చి.. మను తండ్రి బ్రతికే ఉన్నాడని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.