English | Telugu

Guppedantha Manasu : అనుపమ కొడుకుని మహేంద్ర దత్తత తీసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1053 లో.. కాలేజీలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మొన్న పేరెంట్స్ , లెక్చరర్ మీటింగ్ అంటే సక్సెస్ కాలేదని బోర్డు మెంబర్స్ అంటారు. మళ్ళీ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా దానికి ఎందుకు అంతలా ఫీల్ అవ్వడమని మహేంద్ర అంటాడు. అలా అంటారేంటి సర్ మీరు.. అలా చెప్పడం వల్ల కాలేజీ పరువు ఏమవుతుందని బోర్డు మెంబర్స్ అంటారు.

ఆ తర్వాత నేను కరెక్ట్ గానే మాట్లాడానని మహేంద్ర వెటకారంగా మాట్లాడతాడు. జరిగిన గొడవ గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారని బోర్డు మెంబర్స్ అంటారు. అయిన మను గారి గురించి అడిగితే మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారని వాళ్ళు అడుగుతారు. ఆ సిచువేషన్ లో మా బాబాయ్ స్పందించాడని శైలేంద్ర అంటాడు.‌ మహేంద్ర గారు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చా? అబద్దం ఉండొచ్చు అని వాళ్ళు అంటారు. అంటే మా బాబాయ్ తప్పు చేశాడని అంటున్నారా అని శైలేంద్ర అంటాడు. అందుకే మిషన్ ఎడ్యుకేషన్ ఇంచార్జీగా అనుపమని పెట్టారు.. ఆ రోజు మహేంద్ర గారు చేసింది తప్పని బోర్డు మెంబర్స్ అంటారు. అవును మహేంద్ర.. నువ్వు అలా మాట్లాడి ఉండాలిసింది కాదని ఫణీంద్ర అనగానే.. సరే నేను తప్పు చేసాను అంటున్నారు కదా కాలేజీ నుండి వైదోలగిపోతానని మహేంద్ర అంటాడు. అప్పుడే మను వచ్చి.. నా వల్లే ఇదంతా నేనే వెళ్ళిపోతానని అంటాడు. తను ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడు. కాలేజీకి యాబై కోట్ల అప్పు ఇచ్చాడు. అది కట్టకుండా అతన్ని పంపించలేరని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత వసుధార ఇంటికి వచ్చాక.. మీరు అలా కాలేజీకి రానని చెప్పడం కరెక్ట్ కాదని మహేంద్రతో అంటుంది.‌ అసలు ఎందుకు మా విషయం లో ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవుతున్నావని అనుపమ అంటుంది. నువ్వు కూడ మా విషయంలో అలాగే ఇన్వాల్వ్ అయ్యావ్ కదా.. ఈ విషయానికి పరిష్కారం ఆలోచిస్తున్నానని మనుని దత్తత తీసుకుంటున్నానని మహేంద్ర అనగానే.. వసుధార, అనుపమ లు షాక్ అవుతారు. ఆ తర్వాత అనుపమకి దేవయాని ఫోన్ చేసి.. నా మరిది మీ వల్లే కాలేజీకి వెళ్లొద్దని అనుకుంటున్నాడని తిడుతుంది. మహేంద్ర ఫోన్ తీసుకొని.. నేను మీ ఇంటికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నాను.. వచ్చాక మాట్లాడుకుందాం వదిన అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మీ తమ్ముడు ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నాడంట అని ఫణీంద్రతో దేవయాని చెప్తుంది. దేనిగురించి అని అందరు ఆలోచిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.