English | Telugu

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ఆ నిజం తెలిసిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1037 లో.. మనుని తన దగ్గర నుండి వెళ్ళమని అనుపమ చెప్తుంది. అప్పుడే వసుధార, మహేంద్రలు వచ్చి.. ఎక్కడికి వెళ్తాడు. ఇక్కడే ఉంటాడు. పదండీ భోజనం చేద్దామని మహేంద్ర అనగా.. నేను రానని అనుపమ అంటుంది. దాంతో నేను ఉంటే మేడమ్ భోజనం చేయరు, నేను వెళ్తానని మను అంటాడు.. మను ఉంటే భోజనం చేయవా అని అనుపమని మహేంద్ర అడుగుతాడు. అనుపమ సైలెంట్ గా ఉంటుంది. మౌనం అంగీకారం మను ఉంటే మేడమ్ కి ఏం ప్రాబ్లెమ్ లేదు.. మేడమ్ మీరు ఫ్రెష్ అయి రండి అని వసుధార చెప్తుంది..

ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరు వస్తారు. అనుపమ పక్కనే మనుని కూర్చొపెట్టాలని ఏంజిల్ ప్లాన్ చేస్తుంది. మను కూర్చొబోతుంటే.. అది నా ఫేవరేట్ ప్లేస్ మీరు అత్తయ్య పక్కన కుర్చోండి అని ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత అందరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. అందరం ఇక్కడే ఉన్నాము కదా ఒక సెల్ఫీ తీసుకుందామని ఏంజిల్ అనగానే.. వద్దని అనుపమ అంటుంది. ఆయిన ఏంజిల్ వినకుండా సెల్ఫీ తీస్తుంది. ఆ తర్వాత ఈ ఫొటోస్ అన్ని మీకు పంపిస్తానని మనుకి ఏంజిల్ చెప్తుంది. ఇక నేను వెళ్తానని మను అంటుంటే.. ఈ ఒక్కరోజు ఉండు నీకు ఎప్పుడు రావాలి అనిపించినా వచ్చేయ్ ఎవరికీ బయపడాల్సిన అవసరం లేదని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత మను వెళ్తు వసుధార ఫోన్ చేసి మాట్లాడాలన్న విషయం గుర్తుకు వచ్చి.. వెనక్కి వచ్చి ఏం మాట్లాడాలని అడుగుతాడు. మీరు ఏ తప్పు చెయ్యలేదని తెలిసింది కదా కాలేజీకి రండి అని వసుధార అనగానే.. " మీరు పొమ్మనగానే వెళ్లిపోయి, రమ్మనగానే రాలేను.. అనుపమ గారు రావద్దని చెప్పారు తన మాట తీసేయ్యలేను" అని మను చెప్పి వెళ్లిపోతాడు. మను మాటలు అనుపమ, ఏంజిల్ వింటారు. మరొకవైపు అనుపమ, మనుల మధ్య గొడవ నాకు అర్థం అయింది. మను తండ్రి గురించి అడిగాడనుకుంటా.. అనుపమ అతనేవరో చెప్పలేకపోతుందని శైలేంద్రతో దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.