Read more!

English | Telugu

Guppedantha Manasu : కన్నకొడుకుతో ఏ తల్లి ఇలా చేయదన్న మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-1031 లో..  అనుపమ ఆసుపత్రి పాలవ్వడం.. అంతకు ముందు రిషీపై దాడి.. జగతిపై ఎటాక్. ఈ కుట్రలన్నింటికి సూత్రధారి ఎవరో ఉన్నారు.. మన కాలేజీని దక్కిచుంకోవడానికి ఇవన్నీ చేస్తున్నారంటూ దేవాయనితో ఫణీంద్ర శైలేంద్ర ముందే అంటాడు. దాంతో వాళ్లిద్దరు ఆందోళన చెందుతారు. ఇది బయట వాళ్ళు చేస్తున్నారా.. వాళ్ళెవరో నువ్వే కనిపెట్టాలి శైలేంద్ర.. అప్పుడు చెప్తా వాళ్ళ పని అని ఫణీంద్ర అంటాడు. దాంతో హా సరే డాడీ అని శేలేంద్ర అంటాడు.                                                 

ఏం సరేనో ఏమో.. నువ్వు కాలేజీలో చేసేదేమి లేదు. పోనీ రిషి జాడ కనుక్కోమంటే అది చేయలేదు. కనీసం ఇదైనా సరిగ్గా చెయ్యి.. మన శత్రువులు ఎవరో నువ్వే పట్టుకొని నాకు అప్పగ్గించాలి అర్థమైందా అని చెప్పి ఫణీంద్ర అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో మను దగ్గరికి ఏంజిల్, వసుధారలు వస్తారు. మను తినడానికి స్నాక్స్ ఇస్తారు. నాకు తినాలని లేదు.. ఆకలిగా లేదని మను అంటాడు. మనసు బాలేదా అని వసుధార అనగా.. ఆకలిగా లేదని మను అంటాడు.                                  ఇక ఏంజిల్ .. తిను మను అని అంటుంది. నాకు అలవాటైపోయిందని మను అంటాడు. ఇక ఏంజిల్ అయితే మనుని కూర్చోబెట్టి తినమని గట్టిగా అంటుంది. మను ఆలోచిస్తుంటాడు. ఏంటి తినే ఓపిక లేదా లేదంటే నిను తినిపిస్తానని ఏంజిల్ అంటుంది. దాంతో వద్దులే అని మను తింటాడు. అది చూసిన వసుధార, ఏంజిల్ సంతోషపడతారు. ఇక మను తింటుంటే పొలమారుతుంది. దాంతో ఏంజిల్ తలనిమురుతూ... వాటర్ బాటిల్ మరిచిపోయా అని అంటుంది. నువ్వు ఇక్కడే ఉండ నేను వెళ్ళి తీసుకొస్తానని వసుధార వెళ్తుంది. ఇంతలోనే ఏంజిల్ తీసుకొచ్చి.. మనుకి తాగిస్తుంటుంది. ఇక డాక్టర్ వచ్చి అనుపమ కండిషన్ చూసి నార్మల్ గా ఉందని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు. అనుపమని మా ఇంటికి తీసుకుపోతానని ఏంజిల్ అంటుంది. లేదు.. అనుపమని మా ఇంటికి తీసుకెళ్తానని మహేంద్ర అంటాడు. నువ్వైనా చెప్పు వసుధార అని ఏంజిల్ అంటుంది. మను గారికి అమ్మ అనుపమ.. మను గారు ఏమంటే అదే అని వసుధార అంటుంది.

మను గారు ఏమంటారని ఏంజిల్ అడుగుతుంది. నా నిర్ణయం ఏముంది.. ఆవిడ ఇష్టమని మను అంటాడు. అమ్మ ఏంజిల్ నువ్వు మా ఇంట్లో ఉండని మహేంద్ర చెప్తాడు. దాంతో అనుపమని, ఏంజిల్ ని మహేంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు. కారు దిగపోతుంటే అనుపమ పడిపోతుండగా.. మను భుజం పట్టుకొని చూస్తాడు. అనుపమ జాగ్రత్త అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మను ట్యాబ్లెట్ తీసుకొచ్చి అనుపమకి ఇస్తాడు. ఏదైన అవసరమైతే కాల్ చేయండని మను అనగానే.. అవసరం రాదని అనుపమ అంటుంది. దాంతో మను వెళ్ళిపోతాడు. ఇక మహేంద్ర వచ్చి.. మను వెళ్ళిపోయాడా అని అడుగుతాడు. వెళ్తానన్నాడు వెళ్ళాడని అనుపమ అనగానే.. అలా పంపిచేస్తావా.. కుటుంబమన్నాక గొడవలు కామన్. అలా అనీ కన్నకొడుకుతో ఏ తల్లి ఇలా చేయదని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.