English | Telugu

Guppedantha Manasu:జగతిని చంపింది శైలేంద్రే అని తెలుసుకున్న అనుపమ.. ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -944 లో ముకుల్ చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పని శైలేంద్ర డ్రామా క్రియేట్ చెయ్యడంతో ఇక ఎవరికి ఏది నమ్మాలో అర్థం కాదు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర తమ ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడే ధరణి వచ్చి ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్నది మీరే కాదా అని అడుగుతుంది. అవును నేనే కానీ ఇప్పుడు మారిపోయానని శైలేంద్ర నటన మళ్ళీ మొదలుపెడతాడు.

ఆ తర్వాత శైలేంద్ర, దేవాయని ఇద్దరు ఎంత నటించిన ధరణి నమ్మదు. వాళ్లపై కోపంగా బయటకు వెళ్తుంది. ధరణి నమ్మట్లేదని దేవాయని అనగానే.. తనని ఎలా నమ్మించాలో నాకు తెలుసని శైలేంద్ర అంటాడు. మరొకవైపు జగతి ఇన్వెస్టిగేషన్ గురించి ముకుల్, అనుపమ మాట్లాడుకుంటారు. ఈ కేసు ప్రధాన నిందితుడు శైలేంద్ర అని ముకుల్ అంటాడు. మీకేలా తెలుసు అంటూ అనుపమ అడుగుతుంది. ఆధారం దొరికిన వెంటనే తనపై ఎటాక్ జరగడమేంటి? మళ్ళీ ఇప్పుడు రిషి కన్పించకుండా పోవడమేంటి? అంత ఒక పజిల్ లా ఉంది. ఎలాగైనా ఈ కేసుకి సంబంధించిన నిందితులని పట్టుకుంటానని ముకుల్ అంటాడు. ఈ కేసుకి సంబంధించి ఏదైనా కావాలంటే నా ఇన్ ఫ్లుయెన్స్ ఉపయోగిస్తానని అనుపమ చెప్తుంది. మరొకవైపు తనకు తానే ఎటాక్ చేయించుకున్న శైలేంద్ర.. ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే దూరంగా ఉండి వింటుంది. మీరు చాలా బాగా చేశారు. నేను చెప్పినట్టు నాపై ఎటాక్ చేశారని ఆ రౌడీలతో శైలేంద్ర మాట్లాడుతూ.. వాళ్ళకి డబ్బులు ఇవ్వడాన్ని ధరణి చూసి షాక్ అవుతుంది.

మరొకవైపు రిషి గురించి మహేంద్ర, వసుధార ఆలోచిస్తుంటారు. అప్పుడే ధరణి కంగారుగా వసుధార, మహేంద్ర దగ్గరికి వచ్చి... ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్న వాయిస్ మా అయన శైలేంద్రదని అనగానే ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత శైలేంద్ర చేసిన తప్పుల గురించి చెప్తూ.. ఈ ఎటాక్ కూడా తనే చెప్పించుకున్నాడు. ఇందాక ఆ ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే విన్నానని ధరణి చెప్తుంది. అప్పుడే అనుపమ వచ్చి ధరణి మాటలు విని.. నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అంటు ఎండీ చైర్ కోసం ఇదంతా శైలేంద్ర చేస్తున్నాడని ధరణి చెప్తుంది. ఇన్ని రోజులు జగతిని ఎవరు చంపారంటూ అడిగావ్ కదా? ఇప్పుడు తెలిసిందా అని అనుపమతో‌ మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.