English | Telugu

నాన్న ఫొటో చూసి ఎమోష‌న‌ల్ అయిన గోపీచంద్‌

'పక్కా కమర్షియల్' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండేసరికి టీమ్ మొత్తం ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తూ బుల్లితెర మీద అన్ని షోస్ లో వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా క్యాష్ ప్రోగ్రాంకి వచ్చి టీం మొత్తం ఫుల్ మస్తీ చేసింది. సుమ కూడా 'పక్కా కమర్షియల్' అంటూ ప్రతీ దానికి డబ్బులు అడుగుతూ వచ్చింది. ఇటీవల జబర్దస్త్ లో సందడి చేసిన ఈ టీం డైరెక్టర్ మారుతి..అనసూయకు పక్కా కమర్షియల్ అంటూ కితాబిచ్చాడు. ఇక క్యాష్ కి వచ్చిన టీమ్ తో ఫుల్ గా గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేసింది సుమ. ఇక ప్రోమో ఎండింగ్ లో గోపీచంద్ నాన్న టి. కృష్ణ ఫోటో చూపించింది. ఆ ఫోటోని చూసేసరికి గోపీచంద్ ఫుల్ గా ఎమోషన్ ఐపోయాడు.

"దాదాపు నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం నాకు చాలా నేర్పించింది" అంటూ బాధపడ్డారు. "నాకు ఇప్పుడు తెలుస్తోంది అసలు నేనేం కోల్పోయానో.. మా నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయా" అనేసరికి అక్కడ ఉన్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అయ్యింది. గోపీచంద్ 'తొలివలపు' మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే ఇటీవల ఆయన నటించిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. కానీ 'సీటీమార్' విజయంతో మళ్ళీ గోపీచంద్ గాడినపడ్డాడు. తాజా చిత్రం 'పక్కా కమర్షియల్' మంచి హిట్ అవుతుంది అనే ఆశతో ఉన్నాడు. ఈ మూవీ హిట్ ఐతే మాత్రం గోపీచంద్ కి మళ్ళీ దశ తిరిగినట్టే అంటున్నారు ఆడియన్స్.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.