English | Telugu

ఘనంగా  నందు-గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక

టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు సింగర్ గీతామాధురి - యాక్టర్, హోస్ట్ నందు. వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. వీళ్ళు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2019లో ఒక పాప పుట్టింది. ఆమె పేరు దాక్షాయణి ప్రకృతి. 2024 ఫిబ్రవరి 10న గీతామాధురికి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బాబుకి ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ బాబుకు ఘనంగా అన్నప్రాసన వేడుక నిర్వహించారు. అటు నందు, ఇటు గీతామాధురి కుటుంబ సభ్యుల మధ్యలో ఘనంగా శాస్త్రబద్ధంగా ఈ అన్న ప్రాసన నిర్వహించారు. ఇక ఆ పిల్లాడి ఎదురుగా డబ్బులు, పుస్తకాలు, పూలు, ఆహరం పెట్టారు. ముందుగా డబ్బును ముట్టుకున్నాడు తారక్. తర్వాత పుస్తకాన్ని, తర్వాత బంగారాన్ని తాకాడు. ఈ తంతు తర్వాత పెద్దవాళ్లంతా ఒక్కొక్కరిగా వచ్చి చిటికెడు చిటికెడు ఆహారాన్ని తినిపించి ఆశీర్వాదాలు అందించారు.

అలా ఫైనల్ హారతిచ్చేసి ఆ అన్నప్రాసన ప్రక్రియను పూర్తి చేశారు. ఇక గీతామాధురి తన సింగింగ్ కన్సర్ట్స్ తో దూసుకుపోతుంటే...నందు మాత్రం అటు ఢీ షోస్ కి హోస్ట్ గా క్రికెట్ కామెంటరీ చేస్తూ ఇటు కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీస్‌లో నందు సైకోగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో నచించాడు, అలాగే వెల్కమ్ టు మోక్ష ఐలాండ్, వధువు వంటి వెబ్ సిరీస్ లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు వీళ్ళ బాబు అన్న ప్రాసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.