English | Telugu

శేఖర్ మాష్టర్ నడుము గిల్లిన నాగబాబు

త్వరలో దీపావళి పండగ రాబోతున్న సందర్భంగా ఆల్రెడీ షోస్ అన్నీ కూడా ఆ కాన్సెప్ట్ మీద రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈటీవీలో "ఈ దీపావళికి మాస్ జాతర" పేరుతో ఆల్రెడీ ఒక షో రెడీ అయ్యింది. ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ కనిపించాడు. అలాగే నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. "ప్రతీ ఈవెంట్ జాతరలా ఉంటుంది. ఈ ఈవెంట్ మాస్ జాతరలా ఉంటుంది." అని చెప్పాడు ప్రదీప్. " ది రియల్ ఓజిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ బ్యాక్" అంటూ నాగబాబు, శేఖర్ మాష్టర్ ని స్టేజి మీదకు పిలిచాడు. "ఈ దీపావళి వచ్చే దీపావళి వరకు యాద్ ఉంటది" అని చెప్పాడు ప్రదీప్.

"మీ స్మైల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు తెలుసా బాబు గారు" అన్నాడు శేఖర్ మాష్టర్. "ఊరుకో శేఖర్.. నీ డాన్స్ కి మాత్రం ఎంత మంది ఫాన్స్ ఉన్నారు" అంటూ ఆట పట్టించడానికి నాగబాబు శేఖర్ మాష్టర్ నడుము గిల్లేసాడు. ఇక శేఖర్ మాష్టర్ ని చూసి ఆది తెగ నవ్వేసాడు. ఇక బుల్లితెర మీద కనిపించే హీరోయిన్స్, కమెడియన్స్ అంతా వచ్చి డాన్స్ లు వేశారు. అలాగే చివరికి అందరూ కలిసి దీపావళి టపాసులు కాల్చి పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.