English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మినే ప్రిన్సిపల్ అని చెప్పిన సందీప్.. సీతాకాంత్ తెలుసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -342 లో..... సీతాకాంత్ రామ్ దగ్గరికి వస్తాడు. రాగానే ఈ రోజు నీలాగా మిస్ ముందు చేసాను. దాంతో మిస్ నన్ను దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుందని సీతాకాంత్ తో రామ్ చెప్పగానే.. నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు రామలక్ష్మివే అని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ పడుకోపెడతాడు. సీతాకాంత్ రామలక్ష్మితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ ఈ విధంగా చేస్తే రామలక్ష్మి బయటపడుతుందని సీతాకాంత్ అనుకుంటాడు.

మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ అందరిని గుడికి తీసుకొని వస్తాడు. ఎందుకు సడన్ గా తీసుకొని వచ్చావని శ్రీలత అడుగుతుంది. రేపు రామ్ పుట్టిన రోజు కదా.. ఏదో దోషం ఉందట పూజ చెయ్యాలని పంతులు గారు చెప్పారని అందుకే అని సీతాకాంత్ అంటాడు. ఆ మైథిలి రూపంలో రామ్ కి దోషం ఉందేమోనని శ్రీవల్లి అంటుంటే.. నువ్వు సైలెంట్ గా ఉండు మైథిలి గురించి సీతాకాంత్ కి తెలియకుడదని సందీప్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ అటుగా వస్తున్న రామలక్ష్మి కార్ కి పంచర్ చేయిస్తాడు. పంచర్ అయ్యేలోపు గుడికి వెళ్తానంటూ రామలక్ష్మి గుడికి వెళ్తుంది. రామలక్ష్మి లోపలికి వెళ్లి మొక్కుకుంటుంది. ఇప్పుడు మా వాళ్ళని చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలని సీతాకాంత్ అంటాడు. శ్రీలత వాళ్ళని రామలక్ష్మి చూస్తుంది. మరొక వైపు సీతాకాంత్ ని చూస్తుంది. ఇప్పుడేం చెయ్యాలంటూ బయటకు వెళ్ళిపోతుంది. సీతాకాంత్ ఎదురుపడి.. ఏంటి ఎందుకు బయపడి వెళ్తున్నావ్.. రామలక్ష్మి అయితే వెళ్ళిపోతావ్.. మైథిలివి అయితే ఉంటావని సీతాకాంత్ అనగానే.. నేను మైథిలి అని రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. రామలక్ష్మిని శ్రీలత వాళ్ళు చూసి.. ఎక్కడ సీతాకాంత్ చూస్తాడోనని టెన్షన్ పడతారు.

రామలక్ష్మి లోపలికి వెళ్లి మళ్ళీ దేవుడికి మొక్కుకుంటుంటే.. అప్పుడే రామ్, సీతాకాంత్ లు వెళ్తారు. మిస్ ఈ రోజు ఇక్కడ పూజ ఉంది.. మీరు ఉండండి అని రామ్ అంటాడు. వాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుకోవడం శ్రీలత వాళ్ళు చూస్తారు. ఏంటి సీతాకి మైథిలి ముందే పరిచయం ఉన్నట్లు ఉంది.. రామ్ తనని మిస్ అంటున్నాడంటే వాళ్ల ప్రిన్సిపల్ తనేనేమో అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.