English | Telugu

Eto Vellipoyindhi Manasu:కాలేజీలో వాళ్ళిద్దరు మాట్లాడుకునేది సీతాకాంత్, మాణిక్యం చూడగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -7 లో.. మాణిక్యం తన కుటుంబాన్ని తీసుకొని స్నేహితుడి కూతురు ఎంగేజ్ మెంట్ కి వస్తాడు. అక్కడ ఉన్న పెళ్లి కొడుకు.. మా బాస్ వచ్చే వరకు ఆగండి అని చెప్తాడు. ఆ బాస్ ఎవరో కాదు సీతాకాంత్. ఇంటి ముందు వరకు వచ్చి అక్కడ వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోతుంటే పెళ్లి కొడుకు బయటకు వచ్చి మీరు లోపలికి రాకుంటే నేను పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటానని అనడంతో సీతకాంత్ లోపలికి వెళ్తాడు.

సీతాకాంత్ లోపలికి వెళ్తాడు కానీ అతను కూర్చొడానికి కూడా ప్లేస్ ఉండదు. దాంతో చిరాకు పడుతుంటాడు. మరొకవైపు మాణిక్యం అతని స్నేహితులు ఒక గదిలో డ్రింక్ చేస్తుంటారు. కిచెన్ లో రామలక్ష్మి మిర్చీలు చేస్తుంటుంది. మా బాస్ కీ కుర్చీ తీసుకొని రండి అనగానే.. సీతాకాంత్ ని రామలక్ష్మి చూడదు. వీళ్ళ బాస్ పని చెప్తానంటూ కుర్చీని విరగ్గొట్టి పంపిస్తుంది. దాంతో విరిగిన కుర్చీ పై కూర్చొని సీతాకాంత్ కిందపడిపోతాడు. ఆ తర్వాత నేను కింద కూర్చొని ఉంటానని సీతాకాంత్ కింద కూర్చుంటాడు. ఆ తర్వాత లడ్డులు సరిపోయేలా లెవ్వని ఒక ఆవిడ రామలక్ష్మికి చెప్తుంది. నేను సరిపెడతానంటూ ఉన్న లడ్డులని పిసుకుతుంటుంది. ఆలా చేయడం సీతాకాంత్ చూస్తాడు కానీ అది చేస్తున్నా రామలక్ష్మి మొహం కనిపించదు. అవి తీసుకొని వచ్చి నాకు ఇస్తారా ఏంటి అనుకుంటు ఉండగా.. అవే తీసుకొని వచ్చి సీతాకాంత్ కి ఇస్తారు. దాంతో సీతాకాంత్ తిననంటాడు. తినాలని పెళ్లికొడుకు బలవంతం చేస్తాడు.

ఆ తర్వాత పెళ్లి కూతురుని చూసి పాపం చిన్నపిల్ల.. వాడి ఏజ్ నలభై తన ఏజ్ ఇరవై అని మేనేజర్ చెప్పగానే.. ఇది నేను చూడలేనంటు సీతాకాంత్ బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో పెళ్లి కొడుకుని చూసి.. ఇది నేను చూడలేనంటు రామలక్ష్మి బయటకు వెళ్తుంది. మరుసటి రోజు సిరి కాలేజీకి వెళ్తుంది. ధనతో మాట్లాడలని సెక్యూరిటి వాళ్ళని టాబ్లెట్ తీసుకొని రా అంటూ పంపిస్తుంది. వాళ్ళకి సీతాకాంత్ ఫోన్ చేస్తాడు. బయటకు వచ్చామని చెప్పగానే సీతాకాంత్ కంగారుగా కాలేజీ వస్తాడు. సిరి, ధన ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటారు. అదే సమయంలో మాణిక్యం కాలేజీకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.