English | Telugu

సీరియల్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే....?



బుల్లితెర మీద దుర్గ గద్దె వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు ఆమె బుల్లితెర సీరియల్స్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. కానీ ఎందుకు తప్పుకుంది.. కారణమేంటి అంటూ చాలామంది అడుగుతుండేసరికి ఆ విషయాల గురించి ఒక వీడియోలో తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది " నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ముందు సినిమాల వైపు వెళ్లాను. నేను నటించిన ఫస్ట్ మూవీ అల్లరే అల్లరి. బుల్లితెర మీద నటించిన ఫస్ట్ సీరియల్ అపరంజి. అలా ఇండస్ట్రీలోకి వచ్చాక నేను డబ్బింగ్ కార్డు, ఆర్టిస్ట్ కార్డు కూడా సంపాదించుకున్నాను. ఒక పక్కన చదువుకుంటూనే మరో వైపు వచ్చిన సీరియల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. నా లాస్ట్ ప్రాజెక్ట్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, బంగారు పంజరం.

నేను బి.కామ్ కంప్యూటర్స్ చేసాను..తర్వాత ఎం.కామ్ మాస్టర్స్ కూడా చేసాను. ఎం.కామ్ చదివే టైంకి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ చేస్తున్నాను. ఆ టైములో నా మాస్టర్స్ పూర్తయ్యేసరికి ఈ సీరియల్ లో జనరేషన్ చేంజ్ అన్నారు. ఇదంతా లాక్ డౌన్ టైంలో జరిగింది...నా ఎడ్యుకేషన్ పూర్తవగానే కాలేజీ నుంచి ప్లేసెమెంట్స్ కూడా వచ్చాయి. ఐతే నా ఫ్రెండ్ తాను చేసే చోట జాబ్ ఆఫర్ ఉంటే నన్ను రిఫర్ చేసింది. అలా అక్కడ అన్ని రౌండ్స్ కి అటెండ్ అయ్యాను. ఫైనల్లీ నేను ఆ జాబ్ రోల్ కి సెలెక్ట్ అయ్యాను. అలా ప్రస్తుతం యాక్సెంచర్ లో జాబ్ చేస్తున్నా. అలాగే మరో వైపు సీరియల్స్ లో వచ్చే రోల్స్ ని ఎంచుకుని చేసుకుంటూ వెళ్తున్నా..రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కూడా చేసాను. ప్రస్తుతం అది ప్రాసెసింగ్ లో ఉంది. అలా నేను రెండూ మేనేజ్ చేస్తూ వస్తున్నాను. సీరియల్స్ లో మంచి రోల్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం బ్రేక్ తీసుకున్నా అంతే కానీ సీరియల్స్ అస్సలు మానేయను" అని చెప్పింది దుర్గ.



Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.