English | Telugu

జూనియర్ పవన్ కళ్యాణ్...మనల్ని ఎవడ్రా ఆపేది




ఢీ సీజన్ 20 ఇది సర్ మా బ్రాండ్ షో ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ గా సాగింది. ఇందులో రీ-రిలీజ్ స్పెషల్ థీమ్ లో ఒక్కో కొరియోగ్రాఫర్ ఒక్కో మూవీలోని సాంగ్ ని రీ-రిలీజ్ చేస్తూ పెర్ఫార్మ్ చేశారు. ఇక భూమిక ఐతే గబ్బర్ సింగ్ సాంగ్ ని రీ-రిలీజ్ చేసింది. దాంతో జడ్జెస్ ఫిదా ఇపోయారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ అలా అచ్చంగా పవన్ కళ్యాణ్ లా నడుచుకుంటూ వచ్చి ఎంటర్టైన్ చేశారు. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్, ఆయన సిగ్నేచర్ స్టెప్స్ ని వేసి అలరించారు. అప్పుడు హోస్ట్ నందు ఆదిని ఒక విషయం అడిగాడు. "జూనియర్ పవర్ స్టార్ ని చూస్తేనే షేక్ వస్తోంది. ఆది పవర్ స్టార్ ని పర్సనల్ గా కలిసి ఎలా తట్టుకుంటారయ్యా మీరు ఆ చరిష్మాని" అని అడిగాడు.

"మాములుగా ఎప్పుడు ఎవరిని కలిసినా కానీ ఒక్కసారి ఎగ్జాయిట్మెంట్ ఉంటుంది. రెండో సారి నార్మల్ అనిపిస్తుంది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారినే ఎప్పుడు ఎన్ని సార్లు కలిసినా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. " అని చెప్పాడు. ఇక ఎన్నికల సమయంలో జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న ఆది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ గెటప్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా తనకు ఢీ షోకి రావడం కొత్త ఎనర్జీని నాలో జెనెరేట్ అవుతూనే ఉంటుంది.. ఈ టైములో బాస్ చెప్పిన డైలాగ్ ఒకటి అంటూ "మిత్రమా అసలే చీకటి..రోడ్లంతా గతుకులు. చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ మంచి ఫోర్స్ తో డైలాగ్ చెప్పారు. ఢీ షో సీజన్ 20 లో విన్నర్ కొరియోగ్రాఫర్స్ అంతా వచ్చి పెర్ఫార్మ్ చేస్తున్నారు. అలాగే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్, రెజీనా వ్యవహరిస్తున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.