Read more!

English | Telugu

కాలేజ్ లో స్పాట్ వాల్యుయేషన్.. ధర్మరాజు ‘కీ’ కొట్టేశాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -719 లో.. వసుధార ఎక్కువగా వర్క్ చేస్తుందని రిషి కాఫీ కలుపుకొని తీసుకువచ్చి ఇస్తాడు. కాసేపు వసుధార కోసం అలా చూసి తన రూమ్ లోనే పడుకుంటాడు. ఇక వసుధార వర్క్ అయిపోయాక హాల్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఉదయం దేవయాని వచ్చేసరికి  వసుధార హాల్లో పడుకున్నది చూసి.. నీ స్థానం ఏంటో ఇప్పటికైనా అర్థం అయిందా అని దేవయాని వసుధారని అంటుంది. నా స్థానం రిషి సర్ గుండెల్లో, మీ నిజ స్వరూపం రిషి సర్ కు తెలిస్తే మీ స్థానం ఏంటో అని వసుధార అంటుంది. అప్పుడే వచ్చిన జగతితో.. చూడు జగతి నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అని దేవయాని అంటుంది. నీ కోడలు లాగా నా కోడలు నువ్వు చెప్పినట్టు వినే రకం కాదని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది జగతి. దాంతో దేవయానికి కోపమొస్తుంది.

ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన రిషి, వసుధారలు స్పాట్ వాల్యుయేషన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంతలోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వాల్యుయేషన్ స్పాట్ ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్ ధర్మరాజు కాలేజీకి వస్తాడు. అతనికి ఆ కాలేజీకి స్పాట్ వాల్యుయేషన్ ఇవ్వడం ఇష్టం ఉండదు. అందుకని ఏ చిన్న తప్పు కనిపించినా యాక్షన్ తీసుకోవాలని ధర్మరాజు అనుకుంటాడు. ఇక మహేంద్ర, రిషి వాళ్ళకి ధర్మరాజు తనని తాను పరిచయం చేసుకుంటాడు. కాలేజీలో వాల్యుయేషన్ స్పాట్ దగ్గర చిన్న మిస్టేక్ కూడా కనిపించడం లేదని ధర్మరాజు అనుకుంటాడు. మహేంద్ర క్యాబిన్ లో.. ధర్మరాజు, మహేంద్ర మాట్లాడుకుంటుండగా జగతి వచ్చి మహేంద్రని పిలుస్తుంది. మహేంద్ర వెళ్తుండగా తన జేబు లో ఉన్న 'కీ'(తాళంచెవి)తో పాటుగా టేబుల్ మీద ఉన్న పేపర్ వాల్యుయేషన్ బండిల్ ఒకటి కింద పడిపోవడంతో ధర్మరాజు అది గమనించి.. కీ తీసుకొని తన బ్యాగ్ లో ఉన్న సబ్బుపై పెట్టి దానిపై ముద్ర వేసి మళ్ళీ 'కీ' అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళి ఇంకొక 'కీ' ని తయారు చేసి తీసుకొని వస్తాడు. పేపర్ వాల్యుయేషన్ బండిల్ లో కొన్ని తీసుకొని వెళ్తాడు ధర్మరాజు.

ఆ తర్వాత అందరూ కాలేజీ నుండి వెళ్ళిపోతుండగా జగతి, వసుధారలు.. ఆ రూమ్ తాళం తీసి ఉండడం గమనిస్తారు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే రిషి, మహేంద్రలకు కాల్ చెయ్యడంతో వాళ్ళు వచ్చి మిగతా బండిల్ లు ఏమయ్యాయ్ అని అనుకుంటారు. జగతి 'కీ' చూస్తూ ఈ 'కీ'కి సబ్బు ఉందేంటి అంటుంది జగతి. రేపు ఈ విషయం అందరికి తెలిస్తే కాలేజీ పరువుపోతుందని వసుధార అనగానే.. ఈ పని ఎవరు చేసారో నాకు తెలుసు వసుధార.. పదా వెళ్దామంటూ రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.