English | Telugu

టికెట్ టూ ఫినాలే రేస్ నుండి డీమాన్ పవన్ అవుట్.. తనూజ సపోర్ట్ ఎవరికంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం టికెట్ టూ ఫినాలే రేస్ జరుగుతుంది. పోటీదారులు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం. మూడో టాస్క్ ఆడడానికి ఏ ముగ్గురు ఆడుతారో నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో అందరు డిస్కషన్ చేసుకొని సుమన్, డీమాన్, కళ్యాణ్ పేర్లు చెప్తారు. ఇక వీరు ముగ్గురు ఆడగా.. అందులో డీమాన్ గెలుస్తాడు.‌ డీమాన్ తన పక్కనున్నా గడిని పొంది ఎవరితో పోటీపడాలనుకుంటాడో చెప్తాడు. భరణితో పోటీపడాలని అనుకుంటున్నాని బిగ్ బాస్ కి డీమాన్ చెప్తాడు.

డీమాన్, భరణికి బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. అందులో భరణి గెలుస్తాడు. సంఛాలక్ గా తనూజ ఉంటుంది. డీమాన్ టాస్క్ లో స్ట్రక్ అవుతాడు. భరణి టాస్క్ ఫినిష్ చేస్తాడు. టాస్క్ అయ్యాక ఎందుకు ఇలా చేసావ్.. ఇలా చెయ్యొచ్చు అలా చెయ్యొచ్చు అని డీమాన్ పవన్ కి టాస్క్ పెట్టి చూపిస్తుంది. భరణి టాస్క్ గెలిచినందున డీమాన్ గడులని భరణి సొంతం చేసుకుంటాడు.

పవన్ టికెట్ టూ ఫినాలే టాస్క్ నుండి తొలగింపపడుతాడు. దాంతో డీమాన్ పవన్ ఏడుస్తాడు. టికెట్ టూ ఫినాలే రేస్ నుండి సంజన, తనూజ, డీమాన్ తొలగించబడ్డారు. మిగతా అయిదుగురు ఇంకా రేస్ లో ఉన్నారు. టికెట్ టూ ఫినాలే ఎవరు దక్కించుకున్నారో తెలియాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.