Read more!

English | Telugu

జగతి, మహేంద్రల ప్లాన్ నెరవేరుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. టెలివిజన్ రంగంలో అత్యంత ఎక్కువ TRP తో దూసుకెళ్తున్న ఈ సీరియల్ ఎపిసోడ్ -680 లొకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. వసుధార ప్రాజెక్ట్ గురించి  రిషికి వివరిస్తుంది. ఎలాగైనా వసుధార నుంచి నిజం తెలుసుకోవాలని రిషి ట్రై చేస్తుంటాడు. అయితే వసుధార ఏ మాత్రం తెలియనివ్వదు. 

మరొకవైపు రిషి, వసుధార లను కలిపే ప్రయత్నంలో జగతి, మహేంద్రలు చక్రపాణి దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. ఇద్దరిని దూరంగా ఎక్కడికైనా పంపిద్దాం. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు.. కానీ కాలేజీలో ఉన్నంత వరకే కదా... అలా ఇద్దరిని దూరంగా పంపిస్తే, ఒకరి గురించి ఒకరికి పూర్తిగా అర్ధం అవుతుందని జగతి చెప్తుంది. దానికి చక్రపాణి సరే అంటాడు.

ఆటో కోసం వెయిట్ చేస్తున్న వసుధార దగ్గరికి రిషి వచ్చి.. లిఫ్ట్ ఏమైనా కావాలంటే అడుగు అనేసరికి.. "నాకెందుకు సర్ లిఫ్ట్. నేను ఇప్పుడు ప్రాజెక్ట్ హెడ్ ని శాలరీ బాగానే వస్తుంది. నేను క్యాబ్ లో వెళ్ళగలను. అయినా కొన్నాళ్ళకు కార్ కూడా కొంటాను.  మీలాగే లిఫ్ట్ కూడా ఇస్తాను" అని వసుధార అంటుంది. పొగరుకేం తక్కువ లేదని రిషి అనుకుంటాడు. ఏం అంటున్నారు సర్ అని వసుధార అడుగుతుంది. ఏం లేదని చెప్తాడు. రిషి మనసులో "ఇద్దరం ప్రేమించుకున్నాం.. నన్ను మిస్ అయ్యానన్న బాధ కనిపించడం లేదేంటి మరిచిపోయిందా? అని అనుకుంటాడు. రమ్మని పిలవచ్చు కదా అని వసుధార, వస్తానని అనొచ్చు కదా అని రిషి అనుకుంటారు. సరే వస్తాను అని వసుధార, ఒకే రా అని రిషి ఇద్దరు ఒకేసారి అనుకుంటారు. ఇద్దరు కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటారు.

రిషితో టూర్ గురించి ఎలా చెప్పాలని జగన్, మహేంద్ర టెన్షన్ పడుతారు. రిషి ఇంటికి వస్తాడు. "ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డాడీ" అని భోజనం చేస్తూ రిషి అడుగుతాడు. ప్రాజెక్ట్ గురించి విలేజ్ టూర్ ప్లాన్ చేసామని మహేంద్ర అంటాడు. గుడ్ అని రిషి  అంటాడు. రిషి, వసుధారలని దూరంగా పంపించి, వాళ్ళు అనుకున్న ప్లాన్ ని జగతి, మహేంద్రలు అమలు చేస్తారో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.