English | Telugu

పెళ్ళి ఆపాలని చూస్తున్న దుగ్గిరాల కుటుంబం.. ప్లాన్ తెలుసుకున్న యామిని!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -748 లో..... అపర్ణ, కనకం ఇందిరాదేవి ముగ్గురు కలిసి పెళ్లి ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేస్తారు. పంతులు వీక్ పాయింట్ తెలుసు.. మీరు వెళ్లి కనకాంబరం అని పిలుస్తుండండి అని ఇందిరాదేవి వాళ్ళకి కనకం చెప్తుంది. ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు పంతులు దగ్గరికి వెళ్లి.. మిమ్మల్ని కనకాంబరం పిలుస్తుంది.. వెళ్ళండి అని చెప్పగానే పంతులు సిగ్గుపడుతూ వెళ్తాడు.

తీరా చూస్తే అక్కడ కనకం ఉంటుంది. మీరెవరని పంతులు అడుగుతాడు. మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని కనకం అనగానే.. కుదరదని పంతులు అంటాడు. ఇందిరాదేవితో పంతులు కోపంగా మాట్లాడుతుంటే.. కనకం ఫొటోస్ తీస్తుంది. మీరు నన్ను బెదిరిస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇందిరాదేవి. అంతే కాకుండా కనకాంబరం విషయం కూడా మీ భార్యతో చెప్తామని అనగానే.. పంతులు భయపడి సరే అంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు. యామిని బ్లాక్ మెయిల్ చేస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు రాజ్ చెప్తాడు. మరొకవైపు రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావని అడుగగా... పక్కనే ఉన్నానని రుద్రాణి అబద్ధం చెప్తుంది.

మరొకవైపు పంతులు గారు ఇందిరాదేవి వాళ్ళందరు కిందకి వస్తారు. పూజకి టైమ్ అవుతుంది అమ్మాయిని తీసుకొని రండీ అని పంతులు అనగానే.. యామిని వస్తుంది. తరువాయి భాగంలో యామిని హారతి ఇస్తుంటే.. దీపం ఆరిపోతుంది. ఇలా జరుగుతుంది పెళ్లి ఆపేయండని అపర్ణ అంటుంది. అవసరం లేదు మళ్ళీ నిశ్చితార్థం పెట్టి ముహూర్తం పెడుదామని పంతులు అనగానే అపర్ణ వాళ్ళు షాక్ అవుతారు. ఇవ్వన్ని నీ ప్లాన్ అని తెలుసని కావ్యతో యామిని అంటుంది. పెళ్లి కంటే ముందు ఆయనకు నేను గుర్తొచ్చిన కూడా పెళ్లి ఆగిపోతుందని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.