English | Telugu

Brahmamudi: పాలల్లో అబార్షన్ ట్యాబ్లెట్ కలిపిన భర్త.. భార్య తాగుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -837 లో... కావ్యకి నిజం తెలిసినట్లు, తను కళ్ళు తిరిగిపడిపోయినట్లు రాజ్ ఉహించుకుంటాడు. ఆ తర్వాత ఈ విషయం కావ్యకి తెలియొద్దనుకుంటాడు. అసలు ఎందుకు రాజ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడోనని ఇంట్లో అందరు ఆలోచిస్తారు. రాజ్ కి అర్థమయ్యేలా చెప్తాను.. తన నిర్ణయం మార్చుకోవాలని రాజ్ ని రిక్వెస్ట్ చేస్తానని రాహుల్ ఇంట్లో వాళ్ళతో అంటాడు. థాంక్స్ రాహుల్ నువ్వైనా నా చెల్లి బాధని అర్థం చేసుకున్నావని స్వప్న అంటుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పండి అని రాజ్ ని కావ్య అడుగుతుంది. నువ్వు మొన్న నేను చెప్పినట్టు వింటానని మాటిచ్చావని రాజ్ అంటాడు. మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. రాజ్ నువ్వు చేస్తుంది తప్పు.. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకోమని రాజ్ తో రాహుల్ అంటాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు కావ్య అని రాజ్ అంటాడు. నేను ఇందుకు ఒప్పుకోనని కావ్య అంటుంది. అయితే నీకు నేను కావాలో, నీ బిడ్డ కావాలో తేల్చుకోమని రాజ్ అనగానే.. నాకు నా బిడ్డనే కావాలని కావ్య అంటుంది.

తరువాయి భాగం లో కావ్య తాగే జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలుపుతాడు రాజ్. కావ్య అది తాగుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. అసలు కళ్యాణ్ ఎంట్రీ ఎపిసోడ్ క్లైమాక్స్ చూపించారంటే కళ్యాణ్ ఏదో చెప్పడానికి వచ్చాడు కాబోలు రిపోర్ట్స్ వదినవి కావు అని చెప్తే రాజ్ పరిస్థితి ఏంటి.. ఇక కావ్య దృష్టిలో రాజ్ విలన్ అన్నమాట. మరి ఈ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.