English | Telugu

Brahmamudi : రేవతి ముసుగు పోయింది.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసామవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -825 లో... ఇంట్లో అందరు భోజనం చేస్తుంటారు. అపర్ణ స్వరాజ్ ని మీద కూర్చోపెట్టుకొని భోజనం తినిపిస్తుంటుంది. అది చూసి రేవతి ఎమోషనల్ అయ్యి, బయటకు వెళ్తుంది. తన వెనకాలే రాజ్, కావ్య వెళ్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది.. తన మనవడిని ప్రేమగా చూసుకుంటుందని రాజ్, కావ్యలతో రేవతి అంటుంది.

ఆ తర్వాత రాజ్, కావ్య, రేవతి తిరిగి ఇంట్లోకి వెళ్తారు. ఏమైందని అపర్ణ అనగానే.. వాళ్ళ అమ్మగారు దూరంగా ఉంటారట.. నువ్వు అలా ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకుంటే వాళ్ళమ్మ గుర్తు వచ్చిందట అని రాజ్ చెప్తాడు. నన్ను కూడా మీ అమ్మ అనుకోమని అపర్ణ అంటుంది. ఎలాగైనా రేవతి ముసుగు తీయాలని రుద్రాణి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కావాలనే రేవతిపై రుద్రాణి వాటర్ పోసి ముసుగు తియ్యబోతుంటే.. అప్పుడే అపర్ణ కోప్పడుతుంది.

మరొకవైపు కావ్య గురించి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకొని అప్పు బాధపడుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కావ్య పడిపోతుంటే రాజ్ చూసి మెల్లిగా కడుపులో నా బిడ్డ ఉందని అంటాడు. మన బిడ్డ అని కావ్య అంటుంది. వాళ్లని చూసి పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కంటున్నారని కళ్యాణ్ తో అప్పు అంటుంది. ఆ తర్వాత సాయంత్రం సరదాగా చీటీ గేమ్ ఆడుతారు. చీటీ లో వచ్చింది చెయ్యాలి. తరువాయి భాగంలో ముసుగులో వచ్చింది రేవతి అని అందరికి తెలిసిపోతుంది. నాకు ముందే తెలుసని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.