English | Telugu

Brahmamudi : వాళ్ళని రౌడీల నుండి కాపాడిన అప్పు.. యామినితో పెళ్ళి వద్దన్న రాజ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -742 లో... కావ్య ఆకలిగా ఉందంటే రాజ్ ఏవో ఫ్రూట్ తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తాడు. ఇద్దరు ఆ ఫ్రూట్ తిని మత్తుగా పడిపోతారు. అదే సమయంలో వాళ్ళని రౌడీలు చూసి.. కావ్య దగ్గరికి కత్తి పట్టుకొని వస్తారు. మరొకవైపు ఏంటి ఈ కావ్య ఫోన్ కలవట్లేదని ఇందిరాదేవి అనగానే.. ఇంట్లో వాళ్ళందరు వాళ్ళకి ఏమై ఉంటుందని టెన్షన్ పడతారు. అప్పు వెళ్ళింది కదా ఖచ్చితంగా తీసుకొని వస్తుందని అపర్ణ అంటుంది. అప్పు ఏమైనా వీరానారీనా.. నిన్న మొన్న డ్యూటీ లో జాయిన్ అయిందని తన గురించి రుద్రాణి నెగెటివ్ గా మాట్లాడుతుంటే.. ఇంట్లో వాళ్ళందరు రుద్రాణిని తిడతారు.

మరోవైపు యామిని టెన్షన్ పడుతుంటే వైదేహి తన దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తుంది. ఆ కావ్యని చంపమని సుపారీ ఇచ్చాను.. ఆ రౌడీలు ఇంకా ఫోన్ చెయ్యలేదని యామిని అంటుంది. ఎందుకు ఇదంతా అని వైదేహి అడుగుతుంది. బావని నా సొంతం చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తానని యామిని అంటుంది. నా కూతురు రాను రాను ఇలా తయారవుతుంది ఏంటని వైదేహి టెన్షన్ పడుతుంది.

ఆ తర్వాత రాజ్ , కావ్య నిద్ర లేచేసరికి వాళ్ళ ముందు రౌడీలు ఉంటారు. రౌడీలు చెట్టుకి కట్టేసి ఉంటారు. వాళ్ళని చూసిన రాజ్‌‌.. కావ్య అలా చేసిందని తనకి రాజ్ కంగ్రాట్స్ చెప్తాడు. అది చేసింది నేను.. మా అక్క కాదని అప్పు అంటుంది. మీరిద్దరు స్పృహలేకుండా పడి ఉంటే రౌడీలు ఎటాక్ చేస్తుండగా.. మేమ్ వచ్చి వాళ్లని పట్టుకున్నామని అప్పు చెప్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పంపించారని రౌడీలని అడుగుతుంది అప్పు. వాళ్ళు సమాధానం చెప్పరు. కావ్యని తీసుకొని అప్పు ఇంటికి వెళ్తుంది. ఇద్దరు అక్కడ జరిగిందంతా ఇంట్లో వాళ్లకు చెప్తారు.

మరొకవైపు రాజ్ ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా డెకరేషన్ చేసి ఉంటుంది. ఏంటి స్పెషల్ అని రాజ్ అనగానే.. ఎల్లుండి మీ పెళ్లి కదా అని వైదేహి అంటుంది. రాజ్ షాక్ అవుతాడు. తరువాయి భాగం లో నాకు ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదని రాజ్ అనగానే అందరు కలిసి రాజ్ ని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.