English | Telugu

Brahmamudi : శోభనం గదిలోకి వెళ్ళిన కళ్యాణ్ కి నిరాశే...ఇంటి బాధ్యతలు కావ్య గుప్పట్లో!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో.. కావ్య ముందు కావాలనే శ్వేతతో రాజ్ మాట్లాడుతుంటాడు. అది కావ్య వినాలని, మాటతీరుతో తనకి కోపం వచ్చేలా చేస్తాడు. శ్వేతతో వీడియో కాల్ లో స్వీటి అంటు ప్రేమగా మాట్లాడతాడు రాజ్. కావ్యని అలా మోసం చెయ్యడం శ్వేతకి నచ్చదు కానీ రాజ్ చెప్పాడని శ్వేత భావిస్తుంది. రాజ్ మాట్లాడిన దానికి సమాధానం చెప్తంటుంది. వాళ్ళు వీడియో కాల్ లో మాట్లాడుతుంటే వాళ్ళని కావ్య డిస్టబ్ చేస్తు.. అటు ఇటు వెళ్తుంటుంది.

ఆ తర్వాత భార్యాభర్తలు ఉన్నప్పుడు.. ఇలా మాట్లాడుకోవడం సంస్కారం కాదని కొంతమందికి తెలియదా అని శ్వేతని ఉద్దేశించి కావ్య అంటుంది. ఇక కావ్య కావాలనే ఫోన్ లో సాంగ్స్ వింటుంది లైట్ అఫ్ చేస్తుంది. ఆ తర్వాత జరగబోయేది చూసి కూడా నీ కాన్ఫిడెంట్ ఇలాగే ఉంటుందేమో చూస్తానని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ శోభనం కోసం హుషారుగా ఏర్పాట్లు చేసుకుంటాడు. పాల గ్లాస్ తో అప్పుడే అనామిక లోపలికి ఎంట్రీ ఇస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి అంటు నాకు ఈ రోజుకి మూడు రోజులు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనగానే కళ్యాణ్ గుక్క పట్టి ఏడుస్తుంటాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు.. మళ్ళీ శోభనం ఆగిపోయిందా అని అందరు అనుకుంటారు. అనామిక అలా అనగానే కళ్యాణ్ సరే అంటాడు. నిన్ను నా వాడిని చేసుకునే దాకా నేను నీ దాన్ని అవ్వను.. ఆఫీస్ పగ్గాలు నీకు.. ఇంట్లో మహారాణిలా నేను ఉండాలని అనామిక అనుకుంటుంది. ఆ తర్వాత అప్పు దగ్గరికి కృష్ణమూర్తి వచ్చి మాట్లాడుతాడు. నేను నిజంగానే పోలీస్ అవ్వాలని అనుకుంటున్నా అని అప్పు అనగానే కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతు సపోర్ట్ చేస్తాడు.

మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ బయటకు వస్తుంటే శోభనం జరిగిందని అందరూ అనుకునేలా కళ్యాణ్ ని రెడీ చేసి అనామిక బయటకు పంపిస్తుంది. కళ్యాణ్ ని చూసిన సుభాష్, ప్రకాష్ ఇందిరాదేవిలు నవ్వుకుంటారు.. వెళ్లి రెడీ అయిరా అంటూ కళ్యాణ్ ని పంపిస్తారు. అందరు నమ్మారా అని అనామిక అడుగుతుంది. మరోవైపు అప్పు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తు ఉంటుంది. తరువాయి భాగంలో ఇక ఈ ఇంటికి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలు నీకే ఇస్తున్నా.. ఇదిగో తాళాలు ఇక ఎవరికి ఏం అవసరం వచ్చిన నీ దగ్గరికే రావాలని కావ్యకు అపర్ణ చెప్తుంది. అది విని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.