English | Telugu

క్రికెట్ కామెంటేటర్ గా మానస్...

బుల్లితెర మీద నటించేవాళ్ళు ఒక మెట్టు ఎక్కుతూ అటు సినిమా డైరెక్టర్స్ గా ఇటు యాక్టర్స్ గా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు మానస్ వంతు వచ్చింది ఐతే మానస్ అటు సినిమాల్లోకో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో కాదు వెళ్తోంది. మానస్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పెట్టాడు. "హోస్టింగ్ నుంచి కామెంటరీకి వెళ్తున్నా. ఐపిఎల్ 2024 కి కామెంటరీ చెప్తున్నా..ప్రతీ శనివారం స్టార్ స్పోర్ట్స్ తెలుగు చూడండి" అంటూ ఒక టాగ్ లైన్ పెట్టాడు. ఇప్పటికే క్రికెట్ అంటే ఎంతో ఫ్యాషన్ తో ఉండే నందు కూడా క్రికేట్ కామెంటేటర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు మానస్ కూడా కామెంటేటర్ గా మారిపోయాడు. దానికి సంబంధించిన మేకప్, ఐపిఎల్ కామెంటరీ రూమ్ లోకి ఎంట్రీ మొత్తం వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. మానస్ ఇప్పటికే బుల్లి తెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా స్టార్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం "బ్రహ్మముడి" సీరియల్ లో రాజ్ క్యారెక్టర్ లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే మరో వైపు స్టార్ మాలో " నీతోనే డాన్స్ 2 . 0 " కొత్త సీజన్ లో శుభశ్రీ రాయగురుతో కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మానస్ కి ఇప్పుడు చేతి నిండా పని ఉంది. అంతే కాదు కొంత కాలం క్రితం వరకు విష్ణుప్రియతో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు జిమ్ లో బాడీ పెంచి కండలు పెంచి కొత్త కొత్త షోస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి తనను తాను ఎలివేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక నెటిజన్స్ ఐతే "అన్న లక్కింగ్ హాట్, చాలా బాగున్నారు. ఆల్ ది బెస్ట్, సూపర్ అన్నా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బుల్లితెర మీద చాలా షోస్ కి హోస్టింగ్ కూడా చేసిన మానస్ కామెంటరీ ఇవ్వడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటున్నారు మానస్ ఫాన్స్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.