English | Telugu

Brahmamudi : అప్పు, కావ్య ప్రెగ్నెంట్.. ఎమోషనల్ అయిన కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -798 లో..... రాజ్ తో ఇందిరాదేవి, అపర్ణ మాట్లాడతారు. కావ్యని నువ్వు అపార్థం చేసుకోవడం ఆపేయమని అంటారు. మరొకవైపు కళ్యాణ్ కవితలు రాసుకుంటుంటే అప్పు వచ్చి నాకు పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందని చెప్తుంది. ఇప్పుడు మామిడికాయలు దొరకవని కళ్యాణ్ అంటాడు. ఇక అంతలోనే కళ్యాణ్ కి అప్పు ప్రెగ్నెంట్ అన్న విషయం అర్థమై అప్పుని ఎత్తుకొని చుట్టుతిప్పుతాడు.

ఆ తర్వాత కళ్యాణ్ హాల్లోకి వెళ్లి అందరిని పిలుస్తాడు. ఆ విషయం ఎలా చెప్పాలో సిగ్గుపడతాడు. ఇందిరాదేవికి కళ్యాణ్ చెవిలో చెప్పగా తను అందరికి చెప్తుంది. ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్లిద్దరికి విషెస్ చెప్తుంటారు. ఏంటి పెద్ద వదినకి హ్యాపీగా లేనట్టుంది.. తన కొడుకుకి ముందు పెళ్లి అయింది కానీ వాళ్ళు కాకుండా వీళ్ళు వారసుడిని ఇస్తున్నారని బాధగా ఉన్నట్లుందని రుద్రాణి అనగానే అదేం లేదు నేను హ్యాపీగా ఉన్నానని అపర్ణ అంటుంది. కాసేపటి తర్వాత బిడ్డ పుట్టేవరకు జాబ్ మానెయ్ అని ధాన్యలక్ష్మి అనగానే సరే అత్తయ్య లాంగ్ లీవ్ తీసుకుంటానని అప్పు చెప్తుంది. ఇంట్లో ఉండడం కాదు నేను చెప్పినట్టు వినాలని ధాన్యలక్ష్మి అనగానే సరేనని అప్పు అంటుంది.

మరొకవైపు తను ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి చెప్పే సిచువేషన్ లో లేనని కావ్య బాధపడుతుంటే ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ధైర్యం చెప్తారు.ఆ తర్వాత కళ్యాణ్ అమ్మాయి పుట్టాలని.. అప్పు అబ్బాయి పుట్టాలని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అప్పు మామిడికాయ తింటూ కావ్య దగ్గరికి వచ్చి తినమని ఇస్తుంది. అది చూసిన రుద్రాణి.. ఏంటి నువ్వు తినాలి కానీ మీ అక్కకి ఇస్తున్నావ్.. మీ అక్క కూడా ప్రెగ్నెంటా ఏంటని అడుగుతుంది. వెంటనే అప్పు ఏదో చెప్పేసి కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో అల్లుడి గారితో ఎందుకు పెళ్లి వద్దన్నావని కావ్యని కనకం అడుగుతుంది. అది నా ఇష్టమని కావ్య అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు అసలు విషయం కనకంకి చెప్తారు. ఆ విషయం తెలిసి కనకం కావ్య దగ్గరికి వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే రుద్రాణి వచ్చి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.