English | Telugu

Brahmamudi : ట్విస్ట్ ఇచ్చిన కనకం.. బాధగా కావ్య, సంతోషంగా అనామిక!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -750 లో..... రాజ్, యామినిల నిశ్చితార్ధం పెళ్లి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాజ్ అయిష్టంగానే ఉంటాడు. ఇద్దరు రింగ్ లు మార్చుకోవడానికి సిద్ధం అవుతారు. ఉంగరాలు తీసుకొని వైదేహి వస్తుంటే.. కనకం కావాలనే వైదేహీని పడేలా చేస్తుంది. ఉంగరాలున్న బాక్స్ కిందకి పడిపోతాయ్.

వెంటనే కనకం అందులో నుండి ఉంగరాలు వైదేహీకి తెలియకుండా తీస్తుంది. చూసుకోవాలి కదా వైదేహి గారు అని కనకం అంటుంది. మీలా డబ్బున్న వాళ్ళింటికి కోడలిని చేయాలని.. నాకేం కోరికలు లేవని వైదేహి అంటుంది. దాంతో అవునండి పెళ్లి అయిన వాళ్ళని వేరు చేసి కూతురిని ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన నాకు లేనందుకు సిగ్గుపడుతున్నానని కనకం కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత యామిని, రాజ్ ఉంగరాలు మార్చుకోవాలని చూసేసరికి రింగ్స్ ఉండవు. దాంతో అపచారం అంటూ ఇందిరాదేవి వాళ్ళు అంటుంటారు. దాంతో ఏం పర్లేదు బావ.. నీ చేతికి ఒక రింగ్.. నా చేతికి ఒక రింగ్ ఉందిది.. ఇవే మార్చుకుందామని యామిని అంటుంది.

ఇక ఆ ఉంగరాలు మార్చుకునే టైమ్ కి కళ్యాణ్ బయటకు వెళ్లి ఏదో శబ్దం చేస్తుంటాడు. ఆ సౌండ్ కి అందరు బయట వైపు చూస్తారు. కనకం మాత్రం తెలివిగా యామినికి రాజ్ తోడిగినట్లు ఉంగరం తొడుగుతుంది. అది పంతులు చూసి షాక్ అవుతాడు. యామిని రాజ్ తొడిగాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య కూడా రాజ్ ఉంగరం తొడిగాడని బాధపడుతుంది. రా బావా అంటు యామిని గర్వంగా తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.