English | Telugu

Brahmamudi : కావ్య పెళ్ళి ఫోటోని రాజ్ చూస్తాడా.. రుద్రాణి మాస్టర్ ప్లాన్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -722 లో..... రాజ్ ని ఇంటికి పిలిచారని కావ్య ఇంట్లో వాళ్లపై కోపంగా ఉంటుంది. తనకి గతం గుర్తుచేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. మొన్నే కదా అలా అయిందని కావ్య కోప్పడుతుంది. రాజ్ కి మేమ్ ఏం చెప్పడం లేదు కదా.. కేవలం రాజ్ నీ వెనకాల తిరిగేలా చేస్తున్నాం.. ఆ యామిని అంటే వాడికి ఇష్టం లేదట.. నువ్వు అంటే ఇష్టం అంట.. నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడని అపర్ణ అంటుంది.

చెప్పినట్లు ఎవరు పట్టించుకోవడం లేదని కావ్య బాధపడుతు వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ బావ అని యామిని అడుగుతుంది. మన ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళానని రాజ్ చెప్పగానే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విషయం వెళ్లి తన పేరెంట్స్ కి చెప్తుంది. బావలో మార్పు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం నా శత్రువుకి చెప్పాలని కావ్యకి యామిని ఫోన్ చేసి.. మా బావ తన ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాడు.. అంటే నేనంటే అంటే ఇష్టమే కదా అని యామిని అంటుంది‌. రాజ్ నా దగ్గరికి వచ్చాడు. మా వాళ్ళని బుట్టలో పడేయ్యడానికి వచ్చాడని కావ్య అనగానే యామిని షాక్ అవుతుంది. రాజ్ నన్ను ఇంత మోసం చేశాడా అని యామిని కోపంగా ఉంటుంది.

మరొకవైపు సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, కావ్యని పిలిచి రాజ్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత కళ్యాణ్ భోజనం చెయ్యకుండా అప్పు కోసం వెయిట్ చేస్తాడు. దాంతో ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. అప్పుడే అప్పు వచ్చి నాకు ఆకలిగా లేదు అనడంతో ధాన్యలక్ష్మి అప్పుని తిడుతుంది. మరొకవైపు కావ్య దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. మరుసటిరోజు కావ్యని రాజ్ ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతాడు. తరువాయి భాగంలో కావ్య ఆఫీస్ కి వెళ్తానంటే వద్దని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఇక్కడికి వస్తున్నాడు కదా.. కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో చూసేలా చేస్తాను. దాంతో కావ్యకి పెళ్లి అయిందని రాజ్ అనుకుంటాడని యామినితో రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.