English | Telugu

Brahmamudi : కావ్య వెంటపడుతున్న రాజ్.. షాక్ లో ఆ ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -721 లో...... కళ్యాణ్ అప్పు, ఇందిరాదేవి, స్వప్న అపర్ణ అందరు కలిసి రాజ్ కావ్య వెంటపడేలా చెయ్యాలని ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా రాజ్ ని కలవాలని కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. రాజ్ ఒప్పుకుంటాడు. సీన్ కట్ చేస్తే అందరు రాజ్ దగ్గరికి వస్తారు. అపర్ణ మాట్లాడుతుంటే మిమ్మల్ని అమ్మ అనుకుని కేక్ కట్ చేయించాను కానీ మీరు నన్ను మోసం చేసారని రాజ్ అంటాడు. అంటే కావ్య నా గురించి నీకు చెప్పలేదు ఏం అలోచించి చెప్పలేదో నాకు తెలియదు కదా అందుకే సైలెంట్ గా ఉన్నానని అపర్ణ అంటుంది.

అయిన మా కావ్య మోసం చేయలేదు నిజం దాచి అబద్ధం చెప్పింది అంతే మోసం చెయ్యలేదని ఇందిరాదేవి అంటుంది. కావ్య నిన్ను ఇష్టపడుతుంది అందుకే నీ వెంటపడింది.. నీకు క్యారేజ్ పంపింది.. షర్ట్ గిఫ్ట్ పంపిందని అందరు కావ్య గురించి చెప్పగానే రాజ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. నిజంగానే కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారా అని అంటాడు. కానీ నీకు యామినితో పెళ్లి కదా అని అపర్ణ అడుగుతుంది. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు కళావతి గారి మనసులో ఏముందో తెలుసుకుని ఆ విషయం యామినికి చెప్పాలని చూస్తున్న అని రాజ్ అంటాడు. కళావతి తనంతటా తానే బయటపడేలా చెయ్యాలని అందరు రాజ్ కి చెప్తారు. దానికి రాజ్ సంతోషంగా ఒప్పుకుంటాడు.

ఆ తర్వాత రాజ్ ని ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం వడ్డీస్తారు. రాజ్ ఆలా సంతోషంగా ఉంటే సుభాష్, ప్రకాష్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే పై నుండి కావ్య కిందకి వస్తుంది. మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చారని కావ్య అనగానే.. సరే వెళ్తాను కానీ మళ్ళీ రేపు వస్తాను వస్తునే ఉంటానని రాజ్ అంటాడు. అదంతా చూసి రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.