English | Telugu

Brahmamudi : ఇకనుండి కావ్యే ఇంటికి పెద్ద.. కనకాన్ని అవమానించిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -592 లో....కావ్య తనపై అంత పెద్ద బాధ్యతలు పెట్టినందుకు బాధపడుతూ దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. సమస్యలని పక్కన పెట్టి బాధ్యతలు తీసుకోమని ఇందిరాదేవి అంటుంది. చాలా హ్యాపీగా ఉంది నాన్న ఇలా చేసినందుకని సుభాష్ అంటాడు.

ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందటున్నారు కానీ ధాన్యలక్ష్మి, అత్తయ్య, రుద్రాణి గార్లని ఎదరుకోగలనా అని కావ్య అంటుంది. దైర్యంగా ఎదుర్కో మేమ్ మీకు సపోర్ట్ అంటూ ఆస్తుల పేపర్స్, తాళాలు కావ్య చేతిలో పెడతారు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి ఆస్తుల పేపర్స్ ఇచ్చి దీనికి మీరే అర్హులని అంటుంది. లేదు తాతయ్య నీకేం ఇచ్చాడని రాజ్ అంటాడు. తాతయ్యకి నీకు ఆ సామర్థ్యం ఉందని నమ్మాడు. ఆ నమ్మకం నిలబెట్టుకోమని రాజ్ పాజిటివ్ గా మాట్లాడేసరికి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ కలిసి.. అసలు ఇలా జరిగిందేంటని బాధపడుతుంటారు. అప్పుడే స్వప్న వచ్చి సిచువేషన్ తగ్గ సాంగ్ పెడుతుంది. దాంతో రాహుల్, రుద్రాణీలకి ఇంకా కోపం వస్తుంది.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి ఆస్తుల గురించి లాయర్ తో కోర్ట్ లో వేయమని చేప్తుంది. అప్పుడే ప్రకాష్ వచ్చి కావ్యపై కేసు వెయ్యడానికి సిద్ధమయ్యావన్నమాట అని అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రకాష్ విరుచుకుపడతాడు.ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వస్తుంది. దాంతో ధాన్యలక్ష్మి, రుద్రాణి లు కనకాన్ని సూటిపోటీ మాటలతో బాధపెడతారు. తరువాయి భాగం లో రాజ్ దగ్గరికి కొంతమంది వచ్చి.. మీ తాతయ్య గారు తన ఫ్రెండ్ ని నమ్మి కోటి రూపాయలకి షూరిటీ సంతకం పెట్టారు. అది ఇప్పుడు మీ తాతయ్య కట్టాలి. లేదంటే ఆస్తులు తీసుకుంటామని వాళ్ళనగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.