English | Telugu

Brahmamudi : కీలకంగా మారిన ప్రాజెక్ట్‌.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -567 లో...కళ్యాణ్ దగ్గరికి అప్పు వస్తుంది. మీ వదిన తిరిగి మళ్ళీ మీ ఇంటికి వస్తుందట అని అనగానే.. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం పూర్తి అయ్యేవరకు నీ పోలీస్ ట్రేనింగ్ అయిపోవాలి.. నీకు కావాల్సింది నేను రైటర్ గా సెటిల్ అవడం కదా.. ఇప్పటి నుండి సీరియస్ గా ట్రై చేస్తానని అప్పుకి కళ్యాణ్ చెప్తాడు.

మరోవైపు కనకంకి ఇందిరాదేవి ఫోన్ చేసి.. జరిగింది చెప్తుంది. త్వరలోనే కావ్య అక్కడికి రాబోతుందా అని కనకం మురిసిపోతుంది. అప్పుడే కావ్య వస్తుంది. పెద్దాయన పందెం కట్టాడట.. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తున్నావట అని కనకం అనగానే.. ఇప్పుడే అలా అని ఫిక్స్ కాకు అని కావ్య అంటుంది. నువ్వు గెలుస్తావని కనకం అంటుంది. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. నువ్వు చేసిన ప్లాన్ కి ఇక్కడ రాజ్ , కావ్యలని ముసలోడు కలపాలని చూస్తున్నాడని జరిగింది మొత్తం రుద్రాణి చెప్తుంది. అయితే ఈ పందెంలో ఎవరు గెలిచిన మనకే నష్టం అన్నమాట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేస్తానని అనామిక అంటుంది.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. రాజ్, కావ్యల గురించి నెగెటివ్ గా చెప్తుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే ఎవరు అల్ ది బెస్ట్ చెప్పట్లేదని అడిగి మరీ అల్ ది బెస్ట్ చెప్తారు. కని ఇండైరెక్ట్ గా అందరు కావ్యకి అల్ ది బెస్ట్ చెప్తారు. రాజ్ ఆఫీస్ కి వెళ్లి ఎలాగైనా పందెంలో గెలవాలని ప్రయత్నం మొదలు పెడతాడు. తరువాయి భాగంలో ఎంప్లాయిస్ కి వర్క్ బాగా చెయ్యండి అంటూ ఆఫర్స్ ఇస్తాడు. ఆ తర్వాత అనామిక ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇద్దరు గోడవళ్ళో ఉన్నారు. అలాంటోళ్ళు ప్రాజెక్ట్ ఎలా బాగా చేస్తారని అనగానే.. అవునని అతను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.