English | Telugu

Brahmamudi : మాయా దగ్గర ఉన్న సాక్ష్యాలేంటి. బాబు నాన్నెవరో  తెలిసిపోనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -402 లో.. కావ్య, అప్పు ఇద్దరు.. బాబుని రాజ్ తీసుకొని రావడం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అందులో భాగంగా రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసిన అతని దగ్గరకి వస్తారు. రాజ్ మీకెందుకు డబ్బులు ఇస్తున్నాడు? మీరు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కావ్య చెప్పమని బెదిరిస్తుంది. మాయ అనే ఆవిడా రోజు మా సెంటర్ లో బాబుని ఉంచి వెళ్తుంది.. ఒకరోజు అలా ఉంచకుండా బయట రాజ్ తో మాట్లాడడం విన్నానని అతను చెప్తాడు.

బాబుని దుగ్గిరాల ఇంటి వారసుడిగా ప్రకటించాలని, లేకపోతే సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వెళ్తానని మాయ బెదిరించగా.. రాజ్ వద్దని, మాయ చెప్పినట్లే చేస్తానని అన్నట్టుగా అతను చెప్తాడు. అదంతా విన్న అప్పు.. చూసావా బావ నిన్ను నిజంగానే మోసం చేశాడని అంటుంది. సగం నిజం మాత్రమే తెలిసింది. ఇంకా పూర్తిగా తెలియలేదు. ఆ రోజు నాతో నీ జీవితం గురించి నిర్ణయం తీసుకున్నాను.. రేపు చెప్తానని ఎందుకు అంటాడు. ఏదో జరిగింది మనం తెలుసుకోవాలని కావ్య అంటుంది. మరొకవైపు సేట్ ఇలా చేశాడేంటని రాహుల్, రుద్రాణి ఇద్దరు డిస్సపాయింట్ అవుతారు. అప్పుడే స్వప్న కావాలని.. వాళ్ళ ముందు కోటి రూపాయల కారు కావాలి.. మొత్తం ఒకేసారి ఇస్తానంటూ ఫోన్ లో మాట్లాడుతుంది. అది విని బీరువాలో రుద్రాణి పెట్టిన డబ్బులు చూస్తుంది. అక్కడ లేకపోయేసరికి స్వప్ననే ఇదంతా చేసిందని తిట్టుకుంటారు కానీ ఏం అనలేని సిచువేషన్ అని సైలెంట్ గా ఉంటారు.

ఆ తర్వాత అప్పు, కావ్య ఇద్దరు ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఆ రోజు రాజ్ ని ఎవరినైనా కలిసారా అని అందరిని అడుగుతారు. అందరు లేదని అంటారు. సెక్యూరిటీ ని అడుగగా సీసీటీవీ చూడమని చెప్తాడు. అందులో ఆ ఫుటేజ్ డిలీట్ చేసి ఉంటుంది.. హార్డ్ కాపీ ఉంటే మళ్ళీ రీస్టోర్ చెయ్యొచ్చని అప్పు అంటుంది. నువ్వు ఆ పని చేయమని అప్పుకి కావ్య చెప్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. రాజ్ రాగానే అపర్ణ వెళ్లిపోతుంటుంది. ఎందుకు వెళ్తాన్నారంటూ రాజ్ కి సపోర్ట్ గా కావ్య మాట్లాడుతుంది. తరువాయి భాగంలో హార్డ్ కాపీ రిస్టోర్ చేసి వీడియో నీకు పంపంచాను చూడని అప్పు చెప్పగానే.. కావ్య చూసి షాక్ అవుతుంది. అంటే ఈ బిడ్డ ఆయన బిడ్డ కాదన్న మాట అని కావ్య అనుకుంటుంది. ఇంతకీ ఆ బాబుకి నాన్న ఎవరు? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.