English | Telugu

Brahmamudi : మాయా దగ్గర ఉన్న సాక్ష్యాలేంటి. బాబు నాన్నెవరో  తెలిసిపోనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -402 లో.. కావ్య, అప్పు ఇద్దరు.. బాబుని రాజ్ తీసుకొని రావడం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అందులో భాగంగా రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసిన అతని దగ్గరకి వస్తారు. రాజ్ మీకెందుకు డబ్బులు ఇస్తున్నాడు? మీరు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కావ్య చెప్పమని బెదిరిస్తుంది. మాయ అనే ఆవిడా రోజు మా సెంటర్ లో బాబుని ఉంచి వెళ్తుంది.. ఒకరోజు అలా ఉంచకుండా బయట రాజ్ తో మాట్లాడడం విన్నానని అతను చెప్తాడు.

బాబుని దుగ్గిరాల ఇంటి వారసుడిగా ప్రకటించాలని, లేకపోతే సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వెళ్తానని మాయ బెదిరించగా.. రాజ్ వద్దని, మాయ చెప్పినట్లే చేస్తానని అన్నట్టుగా అతను చెప్తాడు. అదంతా విన్న అప్పు.. చూసావా బావ నిన్ను నిజంగానే మోసం చేశాడని అంటుంది. సగం నిజం మాత్రమే తెలిసింది. ఇంకా పూర్తిగా తెలియలేదు. ఆ రోజు నాతో నీ జీవితం గురించి నిర్ణయం తీసుకున్నాను.. రేపు చెప్తానని ఎందుకు అంటాడు. ఏదో జరిగింది మనం తెలుసుకోవాలని కావ్య అంటుంది. మరొకవైపు సేట్ ఇలా చేశాడేంటని రాహుల్, రుద్రాణి ఇద్దరు డిస్సపాయింట్ అవుతారు. అప్పుడే స్వప్న కావాలని.. వాళ్ళ ముందు కోటి రూపాయల కారు కావాలి.. మొత్తం ఒకేసారి ఇస్తానంటూ ఫోన్ లో మాట్లాడుతుంది. అది విని బీరువాలో రుద్రాణి పెట్టిన డబ్బులు చూస్తుంది. అక్కడ లేకపోయేసరికి స్వప్ననే ఇదంతా చేసిందని తిట్టుకుంటారు కానీ ఏం అనలేని సిచువేషన్ అని సైలెంట్ గా ఉంటారు.

ఆ తర్వాత అప్పు, కావ్య ఇద్దరు ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఆ రోజు రాజ్ ని ఎవరినైనా కలిసారా అని అందరిని అడుగుతారు. అందరు లేదని అంటారు. సెక్యూరిటీ ని అడుగగా సీసీటీవీ చూడమని చెప్తాడు. అందులో ఆ ఫుటేజ్ డిలీట్ చేసి ఉంటుంది.. హార్డ్ కాపీ ఉంటే మళ్ళీ రీస్టోర్ చెయ్యొచ్చని అప్పు అంటుంది. నువ్వు ఆ పని చేయమని అప్పుకి కావ్య చెప్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. రాజ్ రాగానే అపర్ణ వెళ్లిపోతుంటుంది. ఎందుకు వెళ్తాన్నారంటూ రాజ్ కి సపోర్ట్ గా కావ్య మాట్లాడుతుంది. తరువాయి భాగంలో హార్డ్ కాపీ రిస్టోర్ చేసి వీడియో నీకు పంపంచాను చూడని అప్పు చెప్పగానే.. కావ్య చూసి షాక్ అవుతుంది. అంటే ఈ బిడ్డ ఆయన బిడ్డ కాదన్న మాట అని కావ్య అనుకుంటుంది. ఇంతకీ ఆ బాబుకి నాన్న ఎవరు? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.