Read more!

English | Telugu

Brahmamudi : డీల్ కుదుర్చుకున్న వారిద్దరు.. ఇంటిగుట్టు మీడియా చేతికి చిక్కిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -390 లో....రాహుల్ ఆస్తి పేపర్స్ పెట్టి సేట్ దగ్గర డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు స్వప్న తీసుకుందని ఇంట్లో వాళ్లకు చెప్పమని డీల్ కుదర్చుకుంటాడు. మరొకవైపు మావయ్య గారికి అసలు నిజం తెలుసు.. మరి ఎందుకు తన కొడుకు ఇంట్లో నుండి వెళ్లిపోయే సిచువేషన్ వచ్చిన నోరు విప్పడం లేదు.. ఎలాగైనా మావయ్య ద్వారా నిజం తెలుసుకోవాలని కావ్య అనుకుంటుంది.

ఆ తర్వాత సుభాష్ దగ్గరికి కావ్య వచ్చి.. మీరు తల్చుకుంటే మీ అబ్బాయి ఇంట్లో నుండి వెళ్లకుండా ఆపగలరు కదా మరెందుకు మౌనం గా ఉన్నారో నాకు అర్థం అవ్వడం లేదు.. మీరు బాబు ని తీసుకొని వెళ్లడం, మీ వెనకాలే మీ అబ్బాయి రావడం మీరు మాట్లాడుకోవడం అంత విన్నానని కావ్య అనగానే.. సుభాష్ షాక్ అవుతాడు. అసలు నిజం ఏంటని కావ్య అడుగుతుంది. నేను చెప్పలేనని సుభాష్ అనగానే.. నా మీద ఒట్టే అని కావ్య తన తలపై చెయ్యి పెడుతుంది. రాజ్ నిజం ఎవరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడు.. నువు చెప్పమని ఒట్టు వేస్తున్నావ్.. నేనేం చెయ్యాలని సుభాష్ అంటాడు. రాజ్ తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావా అని కావ్యని సుభాష్ అడుగగా.. నేను నమ్మటం లేదని కావ్య అంటుంది. అదే నమ్మకంతో ముందుకు వెళ్లి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని సుభాష్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. మీరు ఎందుకు నిజం చెప్పడం లేదు.. మీరు ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్ముతున్నాను.. అసలు ఇదంతా దేని కోసమని కావ్య అంటుంది. తప్పు చేసాను అనడానికి ఈ బాబు సాక్ష్యం.. ఇంకేం కావాలని రాజ్ అంటాడు. కానీ రాజ్ అసలు నిజం మాత్రం చెప్పడు.

మరొకవైపు సేట్ ఇచ్చిన డబ్బులు చూసి.. రాహుల్, రుద్రాణీలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే నా లిప్ స్టిక్ కన్పించడం లేదంటు.. స్వప్న వస్తుంటుంది. ఎక్కడ స్వప్న చూస్తుందోనని ఆ సూట్ కేసు పై‌ రుద్రాణి కూర్చొని ఉంటుంది.‌స్వప్న లేమ్మని చెప్పిన లేవకుండా రుద్రాణి ఒకే దగ్గర కూర్చొని ఉంటుంది. ఆ తర్వాత స్వప్న వెళ్ళిపోయాక.. కొద్దీలో దొరిపోయేవాళ్ళమని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి పంతులు గారు వచ్చి.. ఎప్పుడు దుగ్గిరాల కుటుంబం సీతారాములకళ్యాణo జరిపిస్తారు. ఈసారి ఏం అనట్లేదని నేనే ఇంటి వరకు వచ్చానని పంతులు అంటాడు.‌తరువాయి భాగంలో దుగ్గిరాల కుటుంబం మొత్తం గుడికి వెళ్తారు. అక్కడ మీడియా వాళ్ళు ఈసారి కళ్యాణం ఎవరి చేతులు మీదుగా జరిపిస్తున్నారని అడుగగా రాజ్, కావ్యలు జరిపిస్తున్నారని ఇందిరదేవి చెప్తుంది. ఈ బాబు ఎవరని మీడియావాళ్ళు అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.