English | Telugu

Brahmamudi : డీల్ కుదుర్చుకున్న వారిద్దరు.. ఇంటిగుట్టు మీడియా చేతికి చిక్కిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -390 లో....రాహుల్ ఆస్తి పేపర్స్ పెట్టి సేట్ దగ్గర డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు స్వప్న తీసుకుందని ఇంట్లో వాళ్లకు చెప్పమని డీల్ కుదర్చుకుంటాడు. మరొకవైపు మావయ్య గారికి అసలు నిజం తెలుసు.. మరి ఎందుకు తన కొడుకు ఇంట్లో నుండి వెళ్లిపోయే సిచువేషన్ వచ్చిన నోరు విప్పడం లేదు.. ఎలాగైనా మావయ్య ద్వారా నిజం తెలుసుకోవాలని కావ్య అనుకుంటుంది.

ఆ తర్వాత సుభాష్ దగ్గరికి కావ్య వచ్చి.. మీరు తల్చుకుంటే మీ అబ్బాయి ఇంట్లో నుండి వెళ్లకుండా ఆపగలరు కదా మరెందుకు మౌనం గా ఉన్నారో నాకు అర్థం అవ్వడం లేదు.. మీరు బాబు ని తీసుకొని వెళ్లడం, మీ వెనకాలే మీ అబ్బాయి రావడం మీరు మాట్లాడుకోవడం అంత విన్నానని కావ్య అనగానే.. సుభాష్ షాక్ అవుతాడు. అసలు నిజం ఏంటని కావ్య అడుగుతుంది. నేను చెప్పలేనని సుభాష్ అనగానే.. నా మీద ఒట్టే అని కావ్య తన తలపై చెయ్యి పెడుతుంది. రాజ్ నిజం ఎవరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడు.. నువు చెప్పమని ఒట్టు వేస్తున్నావ్.. నేనేం చెయ్యాలని సుభాష్ అంటాడు. రాజ్ తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావా అని కావ్యని సుభాష్ అడుగగా.. నేను నమ్మటం లేదని కావ్య అంటుంది. అదే నమ్మకంతో ముందుకు వెళ్లి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని సుభాష్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. మీరు ఎందుకు నిజం చెప్పడం లేదు.. మీరు ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్ముతున్నాను.. అసలు ఇదంతా దేని కోసమని కావ్య అంటుంది. తప్పు చేసాను అనడానికి ఈ బాబు సాక్ష్యం.. ఇంకేం కావాలని రాజ్ అంటాడు. కానీ రాజ్ అసలు నిజం మాత్రం చెప్పడు.

మరొకవైపు సేట్ ఇచ్చిన డబ్బులు చూసి.. రాహుల్, రుద్రాణీలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే నా లిప్ స్టిక్ కన్పించడం లేదంటు.. స్వప్న వస్తుంటుంది. ఎక్కడ స్వప్న చూస్తుందోనని ఆ సూట్ కేసు పై‌ రుద్రాణి కూర్చొని ఉంటుంది.‌స్వప్న లేమ్మని చెప్పిన లేవకుండా రుద్రాణి ఒకే దగ్గర కూర్చొని ఉంటుంది. ఆ తర్వాత స్వప్న వెళ్ళిపోయాక.. కొద్దీలో దొరిపోయేవాళ్ళమని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి పంతులు గారు వచ్చి.. ఎప్పుడు దుగ్గిరాల కుటుంబం సీతారాములకళ్యాణo జరిపిస్తారు. ఈసారి ఏం అనట్లేదని నేనే ఇంటి వరకు వచ్చానని పంతులు అంటాడు.‌తరువాయి భాగంలో దుగ్గిరాల కుటుంబం మొత్తం గుడికి వెళ్తారు. అక్కడ మీడియా వాళ్ళు ఈసారి కళ్యాణం ఎవరి చేతులు మీదుగా జరిపిస్తున్నారని అడుగగా రాజ్, కావ్యలు జరిపిస్తున్నారని ఇందిరదేవి చెప్తుంది. ఈ బాబు ఎవరని మీడియావాళ్ళు అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.