Read more!

English | Telugu

Brahmamudi : నట్టింట్లో ఏడుస్తున్న బాబు..  ఎవరో ఏంటో నిలదీయమన్న స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -369 లో..... బాబుపై కావ్య చూపించే కేరింగ్ కి ఇంప్రెస్ అయిపోయి రాజ్ థాంక్స్ చెపుతాడు. మీరు థాంక్స్ చెప్తే మురిసిపోయే పరిస్థితిలో నేను లేనని కావ్య అంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. డెలివరీ బాయ్ ఉయ్యాలా తీసుకొని వస్తాడు. అది చుసిన రుద్రాణి.. అది అడ్డుపెట్టుకొని అపర్ణని ఆడుకుంటుంది.

ఈ ఉయ్యాలా మీ మనవడి కోసం నువ్వు చేసావా పైకి కన్పించవ్ కానీ నీలో కూడా మాతృప్రేమ ఉందని అపర్ణతో రుద్రాణి అంటుంది. నేను నా కొడుకునే దూరం పెట్టాను. వాడి కొడుకుని ఎలా ఉయ్యాలలో వేస్తాననుకున్నావని రుద్రాణిని అపర్ణ అంటుంది. ఆ ఉయ్యాలా నేనే ఆర్డర్ చేశానని రాజ్ వచ్చి‌.. అది తీసుకొని అందులో బాబుని పడుకోపెట్టి ఫోన్ వస్తే మాట్లాడుతు బయటకు వెళ్తాడు. ఆ తర్వాత నట్టింట్లో ఆ బాబు ఉయ్యాలలో పడుకోపెట్టాడు. దీనిని ఎవరు అడగరా అని ధాన్యలక్ష్మి అంటుంది. బాబు ఏడుస్తుంటే అందరు సైలెంట్ గా ఉంటారు. అప్పుడే స్వప్న వచ్చి బాబుని ఎత్తుకొని.. ఎందుకు ఈ బాబు ఏడుస్తుంటే, ఎవరు పట్టించుకోవడం లేదని స్వప్న అడుగుతుంది. ఆ బాబు రాజ్ కొడుకు అని రుద్రాణి చెప్పగానే.. స్వప్న షాక్ అవుతుంది. నిజం చెప్పండి ఎవరు ఈ బాబు అని అడుగుతుంటే.. నా బాబు అంటు రాజ్ ఆ బాబుని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది.. నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్.. ఎందుకు ఇలా చేశావంటూ నిలదీయావా అని కావ్యతో స్వప్న అంటుంది. అక్క కొంచెం ఓపిక పట్టు అని స్వప్నతో కావ్య చెప్తుంది.

మరొకవైపు అప్పుతో కళ్యాణ్ ఫోన్ మాట్లాడటం.. అనామిక వింటుంది. అనామిక అలా వినడం చూసిన కళ్యాణ్.. ఇంకా నువ్వు మారవ్. ఈ చాటుగా వినడమంటు కళ్యాణ్ అంటాడు. మీరు మీ అన్నయ్య లాగే చేసేటట్టున్నారు.. ఆ అప్పుతో మాట్లాడవద్దంటే, ఎందుకు మాట్లాడుతున్నావని అనామిక అనగనే.. నా ఫ్రెండ్ తో ఎవరు ఏమన్నా మాట్లాడుతానని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాబుకు స్నానం చేయించాలని రాజ్ వెళ్తుంటే.. అలా కాదు బయటకు తీసుకొని రండి అంటూ ఎలా చేయించాలో రాజ్ కి కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.