English | Telugu

Brahmamudi : నట్టింట్లో ఏడుస్తున్న బాబు..  ఎవరో ఏంటో నిలదీయమన్న స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -369 లో..... బాబుపై కావ్య చూపించే కేరింగ్ కి ఇంప్రెస్ అయిపోయి రాజ్ థాంక్స్ చెపుతాడు. మీరు థాంక్స్ చెప్తే మురిసిపోయే పరిస్థితిలో నేను లేనని కావ్య అంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. డెలివరీ బాయ్ ఉయ్యాలా తీసుకొని వస్తాడు. అది చుసిన రుద్రాణి.. అది అడ్డుపెట్టుకొని అపర్ణని ఆడుకుంటుంది.

ఈ ఉయ్యాలా మీ మనవడి కోసం నువ్వు చేసావా పైకి కన్పించవ్ కానీ నీలో కూడా మాతృప్రేమ ఉందని అపర్ణతో రుద్రాణి అంటుంది. నేను నా కొడుకునే దూరం పెట్టాను. వాడి కొడుకుని ఎలా ఉయ్యాలలో వేస్తాననుకున్నావని రుద్రాణిని అపర్ణ అంటుంది. ఆ ఉయ్యాలా నేనే ఆర్డర్ చేశానని రాజ్ వచ్చి‌.. అది తీసుకొని అందులో బాబుని పడుకోపెట్టి ఫోన్ వస్తే మాట్లాడుతు బయటకు వెళ్తాడు. ఆ తర్వాత నట్టింట్లో ఆ బాబు ఉయ్యాలలో పడుకోపెట్టాడు. దీనిని ఎవరు అడగరా అని ధాన్యలక్ష్మి అంటుంది. బాబు ఏడుస్తుంటే అందరు సైలెంట్ గా ఉంటారు. అప్పుడే స్వప్న వచ్చి బాబుని ఎత్తుకొని.. ఎందుకు ఈ బాబు ఏడుస్తుంటే, ఎవరు పట్టించుకోవడం లేదని స్వప్న అడుగుతుంది. ఆ బాబు రాజ్ కొడుకు అని రుద్రాణి చెప్పగానే.. స్వప్న షాక్ అవుతుంది. నిజం చెప్పండి ఎవరు ఈ బాబు అని అడుగుతుంటే.. నా బాబు అంటు రాజ్ ఆ బాబుని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది.. నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్.. ఎందుకు ఇలా చేశావంటూ నిలదీయావా అని కావ్యతో స్వప్న అంటుంది. అక్క కొంచెం ఓపిక పట్టు అని స్వప్నతో కావ్య చెప్తుంది.

మరొకవైపు అప్పుతో కళ్యాణ్ ఫోన్ మాట్లాడటం.. అనామిక వింటుంది. అనామిక అలా వినడం చూసిన కళ్యాణ్.. ఇంకా నువ్వు మారవ్. ఈ చాటుగా వినడమంటు కళ్యాణ్ అంటాడు. మీరు మీ అన్నయ్య లాగే చేసేటట్టున్నారు.. ఆ అప్పుతో మాట్లాడవద్దంటే, ఎందుకు మాట్లాడుతున్నావని అనామిక అనగనే.. నా ఫ్రెండ్ తో ఎవరు ఏమన్నా మాట్లాడుతానని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాబుకు స్నానం చేయించాలని రాజ్ వెళ్తుంటే.. అలా కాదు బయటకు తీసుకొని రండి అంటూ ఎలా చేయించాలో రాజ్ కి కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.