Read more!

English | Telugu

భార్య కోసం అమ్మ మాటని కాదన్న రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-235 లో.. పనిమనిషి శాంతని ఎందుకు తీసుకొచ్చావంటూ రాజ్ ని అపర్ణ అడుగుతుంది. అదే టైమ్ అని రుద్రాణి లేనిపోనివి కల్పించి చెప్పుతుంటే అపర్ణ రెచ్చపోతుందని అనుకుంది. అయితే ఇందిరాదేవి మధ్యలో కల్పించుకొని.. తన భార్య‌ పడే కష్టం చూడలేక అన్నీ తెలిసిన పాత పనిమనిషేనా తెచ్చాడని అంటుంది. సారీ అమ్మ, నీకు చెప్పకపోవడం తప్పేనని రాజ్ అన్నాక.. సరేనని అపర్ణ వెళ్తూ రుద్రాణికి సెటైర్ వేస్తుంది. నువ్వు ఏదో చెప్తే, నా కోడలిని ఇంకా తిట్టాలని అనుకున్నావేమో కానీ నీ ప్లాన్ వర్కవుట్ అవులేదు కదా అని రుద్రాణికి సెటైర్ వేస్తుంది అపర్ణ.

మీరు చేసిన పనేంటి అని రాజ్ ని కావ్య అడుగుతుంది.  అదేంటి థాంక్స్ చెప్తావంటే ఇలా అంటున్నావంటేనని రాజ్ అంటాడు. అదే ప్లేస్ లో వేరొకరిని తీసుకొస్తే థాంక్స్ చెప్పేదానిని కావ్య అంటుంది. అత్తయ్యకి నచ్చలేదని కావ్య  అనగా... మా అమ్మకి నేను నచ్చజెప్పుకుంటానని అపర్ణ దగ్గరికి రాజ్ వెళ్తాడు. అపర్ణ దగ్గరికి వెళ్ళిన రాజ్.. మమ్మీ అని అంటాడు. ఏంటి ఇలా వచ్చావ్? మళ్ళీ ఏదైన నిర్ణయం తీసుకున్నావా? ఈసారి మీ భార్య ఏం కావాలని చెప్పిందని అపర్ణ అంటుంది. పనిమనిషిని పెట్టడం తప్పా అని రాజ్ అంటాడు. " ఒకప్పుడు నా మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాడు నా రాజ్ అని గొప్పగా చెప్పుకునేదాన్ని, అర్థం చేసుకోలేని స్థాయికి వెళ్ళావ్. కానీ నా నమ్మకం తప్పని ఋజువు చేశావని అపర్ణ అంటుంది. తప్పు చేసినప్పుడు శిక్ష వేయాలని నువ్వే చెప్పావ్ కదా? నేను మారానా? నువ్వు మారావా? నా మాట శిలాశాసనమని అనేవాడివి అదెక్కడ పాతిపెట్టావు.  అసలు నువ్వే అందరి ముందు  నా మాటకి విలువే లేదన్నట్టు చేశావ్" అని అపర్ణ అంటుంది‌. రాజ్ ఏదో చెప్పాలనుకుంటాడు కానీ అతడిని చెప్పనీయకుండా వెళ్ళిపోమంటుంది.

మరొకవైపు గదిలో ఉన్న కనకం బీరువాలోని రుద్రాణి చీరలని కత్తెరతో కత్తిరిస్తుంది. కాసేపటికి    గదిలోకి వచ్చిన రుద్రాణి బీరువాలో చిరిగిన చీరలని చూసి కోపంగా కనకం అని అరుస్తుంది. ఏమైందని కనకం లేచి అడిగేసరికి తన చీరలు చూపిస్తుంది రుద్రాణి. అయ్యో ఈ మాయదారి ఎలుక మీ చీరలు కూడా కొరికేసిందా అని అడుగుతుంది. ఈ మాయదారి ఎలుకని కత్తెరతో కత్తిరిస్తానంటుంది కనకం. " నా చీరలైనా వందల్లో ఉంటాయి. మీవీ వేలల్లోనే ఉంటాయి. పాపం.. అందుకే ఖరీదైన చీరలు కొనుక్కోకూడదు. మీరు స్వప్న రూమ్ కి వెళ్ళండి ఆ గదిలో ఎలుకలు లేవంట. నేను ఇక్కడే ఉండి ఎలుక వస్తే దాని సంగతి చూస్తానంటుంది. ఇక ధాన్యలక్ష్మి భర్త వాకింగ్ కి వెళ్తుంటే ధాన్యలక్ష్మి ఆపి.. ఫోన్ తీసుకొని వెళ్ళమని చెప్తుంది. ఇక గదిలో రాజ్ ఒక్కడే ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.