English | Telugu

'బ్రహ్మముడి'  సీరియల్  గ్రాండ్ లాంఛ్!

'బ్రహ్మముడి' సీరియల్ ఇప్పుడు స్టార్ మాటీవీలో కొత్తగా మొదలు అయ్యింది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సైతం దీన్ని ప్రమోట్ చెయ్యడంతో ఈ సీరియల్ పై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ సీరియల్ ఎపిసోడ్ -1 లో... సినిమాని తలపించే రేంజ్ లో ఈ సీరియల్ హీరో, హీరోయిన్ ల ఇంట్రడక్షన్ ఉంది.

దుగ్గిరాల కుటుంబం అంటే గొప్ప పేరున్న ధనవంతుల కుటుంబం. దుగ్గిరాల సీత రామయ్య- ఇందిరాదేవి దంపతులు. వీరికి సంతానంగా ఇద్దరు కొడుకులు, ఒక్క కూతురు, ముగ్గురు మనవళ్ళు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.

ఈ సీరియల్ మెయిన్ హీరోగా రాజ్ , హీరోయిన్ గా కావ్య లు నటించారు. ఇద్దరివి విభిన్న మనస్తత్వాలు. వీరిద్దరికి బ్రహ్మ ఎలా ముడి వేస్తాడు అనేదే ఈ సీరియల్ కథ. గాల్లో మేడలు కడుతూ... కోటీశ్వరుల ఇంటికి తన కూతుళ్లను కోడళ్ళుగా చెయ్యాలని కావ్య తల్లి కలలు కంటుంది.

సీతరామయ్య గారి ముగ్గురు మనవాళ్ళది విభిన్న మనస్తత్వం. సీతరామయ్య తన ఇండస్ట్రీస్ పగ్గాలు రాజ్ కి కట్టపెట్టాలాన్న అలోచనలో ఉంటాడు. అయితే రాజ్ కి చేసే ప్రతీ పనిలో క్వాలిటీ ఇంకా పర్ఫెక్షన్ ఉండాలని అనుకుంటాడు. కావ్య మట్టి విగ్రహలకు కలర్ లు వేసుకుంటూ తనలోని కళలకు ప్రాణం పోస్తుంది. ఈ విభిన్న మనస్తత్వాలు కలవారు ఎలా ఒకటి అవుతారనేదే ఈ కథ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.