English | Telugu

రుద్రాణి ప్లాన్ మిస్.. కావ్య అనుకున్నది జరుగుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -205 లో.. తన వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయని కావ్య భావిస్తుంది. ఈ సమస్యకి తనే సొల్యుషన్ ఇవ్వాలనుకోని అపర్ణ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది కావ్య. అపర్ణ మాట్లాడడానికి ఇష్టపడకపోయిన వినండి అని కావ్య చెప్తుంది. అయిన వినకుండా వెళ్తున్న అపర్ణని కావ్య ఆగమని చెప్తుంది.

మీరు వేరుగా ఉండి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉంటే, మీరు ఇంట్లో అందరికి దూరమవుతారు.. అప్పుడే ఇంట్లో అందరికి నాపై సింపతీ పెరిగి నేను వాళ్ళకి మరింత దగ్గర అవుతాను. ఇప్పుడిప్పుడే మీ అబ్బాయి నాకు దగ్గర అవుతున్నారు. ఇక మీరు దూరంగా ఉంటే పూర్తిగా నాకు దగ్గర అవుతాడు. ఇన్ని రోజులు మీరు దేనికైతే భయపడ్డారో అదే జరుగుతుంది అని అపర్ణతో కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ ఆలోచనలో పడుతుంది. మరొక వైపు ఇంట్లో నన్ను అవమానిస్తావా? నీకు నీ అత్తకు మధ్య గొడవ పెట్టానని రుద్రాణి మందు తాగుతూ హ్యాపీగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అపర్ణ వచ్చి సోఫాలో కూర్చొని.. కావ్య అని గట్టిగా అరుస్తుంది. మళ్ళీ ఏం గొడవ అవుతుందోనని అందరూ టెన్షన్ పడుతుంటారు. కానీ కాఫీ తీసుకొని రా? టిఫిన్ ఏం చేసావ్? నన్ను అడిగే చెయ్యాలి కదా అని కావ్య మీద అపర్ణ పెత్తనం చెలాయిస్తుంది. అపర్ణ మాట్లాడినందుకు కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అత్తయ్య మీకు నచ్చిందే, మిమ్మల్ని అడిగే చేస్తానని కావ్య అంటుంది. మరొకవైపు ఇదంతా చూస్తున్న రుద్రాణి.. కావ్యపై కోపంగా ఉంటుందనుకుంటే ఇలా చేసిందేంటని అనుకుంటుంది.

మరొకవైపు రాజ్ తో అపర్ణ మాట్లాడుతుంది. దాంతో రాజ్ సంతోషపడుతు అందరికి చెప్తాడు. మీ అమ్మ నీతో మాట్లాడటానికి కారణం కావ్య అని రాజ్ తో ధాన్యలక్ష్మి చెప్పగానే.. కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి తనని ఎత్తుకొని తిప్పుతాడు.చాలా థాంక్స్ అని కావ్యకి రాజ్ చెప్తాడు. మరొక వైపు ఇంట్లో పనిమనిషిని రావొద్దని చెప్పాను. ఇక నుండి కావ్యనే అంత పని చెయ్యాలి. పెద్దల మాటకు గౌరవం ఇవ్వకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానని రుద్రాణికి చెప్తుంది అపర్ణ. మరొక వైపు కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర కావ్య ఇంకా రాలేదని తనకోసం ఎదురుచూస్తుంటాడు. తను అలా ఎదురుచూస్తుండటం గమనించిన అప్పు.. అక్క వస్తుంది. నువ్వు టెన్షన్ పడకని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.