English | Telugu

Brahmamudi : కావ్యని పెళ్ళికి పిలిచిన యామిని.. తన ప్లాన్ ఏంటంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -743 లో.....రాజ్ ఇంటికి రాగానే.. ఏంటి ఈ హడావిడి అని అడుగుతాడు. ఏంటి ఆలా అడుగుతున్నావ్.. ఎల్లుండి మీ పెళ్లి కదా అని వైదేహి అంటుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని రాజ్ అనగానే.. అప్పుడే యామిని వస్తుంది. ఏంటి మమ్మీ బావకి ఇష్టం లేదట.. అలాంటప్పుడు ఎందుకు ఈ డెకరేషన్ అంటూ పూల డెకరేషన్ అన్ని తీసేస్తుంది.

బావకి నేనంటే ఇష్టం లేనప్పుడు.. నేను ఎందుకు ఇక.. అంటూ కత్తితో చెయ్ ని కోసుకుంటుంది. వెంటనే రాజ్ ఆపి యామిని చెంప చెల్లుమనిపిస్తాడు. ఇక యామిని పేరెంట్స్ రాజ్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాజ్ పెళ్లికి ఒప్పుకుంటాడు. దాంతో యామిని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి రాజ్ కి ఫోన్ చేస్తుంటారు కానీ రాజ్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతుంది. చూసుకొని చేస్తాడులే అని సుభాష్ అంటాడు.

ఇక వాడేందుకు చేస్తాడు యామినితో బిజీగా ఉండొచ్చు అని రుద్రాణి అనగానే.. ఇంట్లో అందరు తనకి చివాట్లు పెడతారు. ఆ తర్వాత మనం చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు.. కావ్య చేస్తే లిఫ్ట్ చేస్తాడేమో ఒకసారి చెయమందామని ఇందిదేవి, అపర్ణ కలిసి కావ్య దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెళ్లేసరికి ఐస్ క్రీమ్ తింటుంది కావ్య. ఏంటి ఇది ఇలా తయారు అయిందని అనుకుంటారు. తరువాయి భాగంలో దుగ్గిరాల ఇంటికి యామిని వస్తుంది. రాజ్తో నా పెళ్లి మీరు తప్పకుండా రండి అని కావ్య దగ్గరికి వచ్చి పిలుస్తుంది యామిని. తప్పకుండా వస్తామని కావ్య చెప్తుంది. కావ్య అలా చెప్పిందంటే ఏదో ప్లాన్ లో ఉండే ఉంటుందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.