English | Telugu

Brahmamudi : తప్పించుకున్న నందగోపాల్.. కావ్యకి చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -594 లో.....రాజ్ నందగోపాల్ ని కలవడానికి వెళ్తుంటాడు. అప్పుడే తన పోలీస్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నందగోపాల్ తప్పించుకోవద్దని చెప్తాడు. మరొకవైపు కావ్య కిచెన్ లో వంట చేస్తుంటే.. ఏం వంట చేస్తున్నావంటూ రుద్రాణి వస్తుంది. ప్రిడ్జ్ లో ఫ్రూట్స్ లెవ్వు చూసుకోవాలి కదా అంటూ ప్రతీదీ తనని అడుగుతుంది. అన్ని తెప్పించు ఇంటి బాధ్యతలు తీసుకున్నావ్ కదా ఆ మాత్రం చూసుకోవాలి కదా అని కావ్యతో రుద్రాణి అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఇద్దరు కలిసి కావ్యని ఒక అట ఆడుకుంటారు.

ఇంట్లో అది పాడైంది.. ఇది పాడైంది చూసుకోవాలి కదా అంటూ మాట్లాడతారు. అందరికి ఫోన్ చేసి అన్ని బాగా చేపిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత బాగా మాట్లాడావ్ ధాన్యలక్ష్మి అని రుద్రాణి అనగానే.. మంచిగ ఉంటే విలువ లేదు ఇలాగే ఉండాలి మనకి రావాల్సిన ఆస్తులు రప్పించుకోవాలని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత నందగోపాల్ ఇంటికి రాజ్ వస్తాడు. అక్కడ సెక్యూరిటీ లేడని చెప్పడంతో అయ్యో అతనికి డబ్బులు ఇవ్వాలి.. అవి ఇవ్వడం కోసం వచ్చానని రాజ్ అనగానే అవునా అంటూ నందు గోపాల్ అడ్రస్ చెప్తాడు సెక్యూరిటీ. దాంతో రాజ్ కోపంగా బయలుదేర్తాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి డిజైనర్ సారి డిజైన్ చేపించుకుంటుంది. దానికి మూడు లక్షలు కావ్యని అడిగి ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ తన పోలీస్ ఫ్రెండ్ కి నందగోపాల్ అడ్రస్ చెప్పి వాడు తప్పించుకోకూడదని చెప్తాడు. మరొకవైపు నందగోపాల్ కి ఎవరో ఫోన్ చేసి రాజ్ నీ కోసం వస్తున్నాడని చెప్పాగానే అతను పారిపోతాడు. రాజ్ అక్కడికి వెళ్ళగానే సెక్యూరిటీ అతను ఇప్పుడే ఫారెన్ వెళ్ళాడని చెప్తాడు.

ఆ తర్వాత రాజ్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి దొరికాడా అని అడుగగా.. పారిపోయాడని రాజ్ చెప్తాడు మనం వస్తున్నట్లు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నాడని అతను రాజ్ తో అంటాడు. ఆ తర్వాత స్వప్న షాపింగ్ కి కావ్య దగ్గర డబ్బులు తీసుకుంటుంది. మీ అక్కకి అయితే ఎందుకు ఏమిటి అని అడగావని రుద్రాణి అనగానే తనపై విరుచుకుపడుతుంది స్వప్న. ఆ తర్వాత రాజ్ సీతారామయ్య షూరిటీ పెట్టిన విషయం తన ఫ్రెండ్ కి చెప్తాడు. తరువాయి భాగంలో ఒక జంటకి ఇందిరాదేవి డబ్బులు ఇస్తే రుద్రాణి ఎందుకు ఇస్తున్నారంటుంది. అయన ఆస్తులు రాసిన ఎవరు అడ్డుచెప్పొద్దని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు కావ్యతో రాజ్ చిరాకుగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.