English | Telugu
Brahmamudi : రాజ్ ని చూసి సీతారామయ్య హ్యాపీ.. వాళ్ళని ఆడుకున్న అప్పు ఫ్రెండ్స్!
Updated : May 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -715 లో.. అప్పుకి స్వప్న ఫోన్ చేసి మనం చేస్తున్న ఈ ప్లాన్ ని ఫెయిల్ చెయ్యడానికి మా అత్త రాహుల్ వచ్చారని చెప్తుంది. అలా ఎందుకు రానిచ్చావని అప్పు అడుగుతుంది. నేను వచ్చే లోపే వెళ్ళిపోయారని స్వప్న చెప్తుంది. సరే వాళ్ళ సంగతి నేను చెప్తానని అప్పుఅంటుంది. అప్పు మాట్లాడింది మొత్తం రాహుల్, రుద్రాణి వింటారు. ఇది మనల్ని ఎలా గుర్తుపడుతుందని అనుకుంటారు.
ఆ తర్వాత భోజనం చేద్దాం రండీ మావయ్య అని సీతారామయ్యని అపర్ణ పిలుస్తుంది. నేను రానని నిరాశగా చెప్తుంటే ఏమైందని సుభాష్ అడుగుతాడు. రాజ్ బ్రతికి ఉన్నాడని చెప్పారు కానీ ఇంతవరకు వాడిని చూపించలేదని కోప్పడతాడు. దాంతో కావ్యకి అపర్ణ ఫోన్ చేసి మావయ్య వాళ్ళకి వీడియో కాల్ లో చూపించు అనగానే.. సరే కానీ మీరు కన్పించకండి అని అంటుంది. మీరు అక్కడ ఉన్నారేంటి అనుకుంటాడని కావ్య అంటుంది. దానికి అపర్ణ సరే అంటుంది. యామినితో రాజ్ మాట్లాడుతుంటే కావ్య పిలుస్తుంది. మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను వీడియో కాల్ లో అని కావ్య ఇంట్లో వాళ్లకి ఫోన్ చేస్తుంది. మొదట సీతారామయ్య, ఆ తర్వాత ఒక్కొక్కరిగా రాజ్ తో మాట్లాడతారు.
రాజ్ తో మాట్లాడాక సీతారామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు రెసాట్ కి వచ్చిన సందీప్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి రాహుల్, రుద్రాణిలని అది చెయ్ ఇది చెయ్ అని ఒక ఆట ఆడుకుంటారు. అప్పు వచ్చి ఇక చాలు అని సందీప్ ఫ్రెండ్స్ కి చెప్తుంది. తరువాయి భాగంలో కళ్యాణ్, అప్పు ఇద్దరు కలిసి రాజ్ కి గతం గుర్తుకొచ్చేలా మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
