English | Telugu

Brahmamudi : దుగ్గిరాల ఇంటి వారసుడు ఆ బాబు.. నిజం చెప్పకపోతే అంతే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -393 లో.. నీ కూతురికి సవతి వచ్చిన పర్లేదు.. అతింట్లో ఉండి ఆస్తులు అనుభవించాలి అనుకుంటున్నావా అని కనకంతో రుద్రాణి అనగానే... నీలాగా ఆస్తి లేదని మొగుడ్ని వదిలేసి పుట్టింట్లో ఉండడం వద్దని రుద్రాణికి కనకం కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత అనామిక వచ్చి.. ఆస్తులు లేదని అంకుల్ ని వదిలేసావా అని అంటుంది.

అదేం లేదని రుద్రాణి అంటూ ఉంటే.. స్వప్న వచ్చి నీ పిట్ట కథ మాకెందుకని అంటుంది. మరొకవైపు సీతారాముల కథని పంతులు చెప్తుంటే.. అందరు వింటుంటారు.. ఆ తర్వాత కళ్యాణ్ ని అప్పు పక్కకి తీసుకొని వస్తుంది. అసలు ఆ మీడియా వాళ్ళని ఎవరో కావాలనే రమ్మన్నారు... ఆ బాబు గురించి తెలుసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నారని అప్పు చెప్పగానే.. అవునా ఎవరు వాళ్ళు కనుక్కోవాలని కళ్యాణ్ అంటాడు. పదా అంటూ కళ్యాణ్ చెయ్యిని అప్పు పట్టుకుంటుంది. అప్పుడే అనామిక వచ్చి.. ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుతుంది. అది భరించలేని కళ్యాణ్.. అనామిక పై చెయ్యి చేసుకుంటాడు. నీ సంగతి చెప్తానంటూ అనామిక కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరు జర్నలిస్ట్ దగ్గరికి వచ్చి.. మీరెందుకు వచ్చారని అడుగుతారు. న్యూస్ కవర్ చెయ్యడానికి వచ్చామని వాళ్ళు చెప్తారు.

మీడియా వాళ్ళు దుగ్గిరాల కుటుంబం దగ్గరికి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. ఈ బాబు గురించే మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంట కదా.. అసలు ఎవరు ఈ బాబు.. మిమ్మల్ని ఎండీగా కూడా తీసేసారంట కదా అని వాళ్ళు అడుగుతారు. ఈ బాబు మా బాబే నాకు నా భర్తకి పుట్టిన బాబు అని కావ్య అనగానే అందరు షాక్ అవుతారు. మీరు చెప్పండి ఈ బాబు ఎవరు అని అపర్ణని అడుగగా.. అవును ఆ బాబు నా మనవడే.. ఈ దుగ్గిరాల ఇంటి వారసుడే అంటు చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత ఇంటికి వచ్చాక.. అసలు ఇందుకే నేను రానని చెప్పానని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో.. నేను వారం గడువు ఇచ్చాను.. ఇంకా రెండు రోజులే ఉంది.. ఈ లోపు బాబు గురించి నిజం చెప్పకుంటే ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను.. ఎవరైనా అడ్డుచెప్తే నా శవాన్ని చూస్తారని అపర్ణ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.