English | Telugu

Biggboss 8 Telugu: బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్.. కారణాలివే!

బిగ్ బాస్ సీజన్-8 ముగిసింది. మూడు నెలల పాటు తెలుగు ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసిన ఈ షో నిన్నటి ఎపిసోడ్ తో పూర్తయింది. ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ తో గ్రాంఢ్ గా కొనసాగిన ఈ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేముందు ఒకలా.. వాళ్ళు వచ్చాక మరోలా ఉంది.

బిగ్ బాస్ గత ఎనిమిది సీజన్ల నుండి ఒకటే ప్యాట్రన్ ఫాలో అవుతున్నారు. సేమ్ గెస్ట్ లు రావడం.. హరీబరీగా ఫినిష్ చేయడం.. కప్ ఇచ్చేయడం.. హోస్ట్ జర్నీ వీడియో చూపించడం కామన్ గా మారింది. ఇదే రెగ్యులర్ గా చూడటం డిస్సపాయింట్ గా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఎంతలా అంటే చాలా మంది అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. దీనికి ప్రధాన కారణం విన్ అయ్యాక ఎమోషన్స్ సరిగ్గా లేవని, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయిన వాటిని కూడా వన్ మినిట్ కూడా చూపించలేదు. ఎందుకంటే అక్కడ టైమ్ లేదు. చాలా మంది సెలెబ్రిటీలు రావడం.. వారి గురించి మాట్లాడం.. సినిమా ప్రమోషన్స్.‌ ఇలా అన్నీ ప్రమోషనల్ కోసం గ్రాంఢ్ ఫినాలే ఏర్పాటు చేశారా అన్నట్టుగా ఉంది.

ఇక నిఖిల్ విన్నర్ అయ్యాక సాధారణంగా అనిపించింది. అదే గౌతమ్ విన్నర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో. ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా లేదని తరలిపోయింది. గత ఎనిమిది సీజన్ల నుండి రెగ్యులర్ గా సాగడం మరింత బోరింగ్ గా అనిపించింది. ముఖ్యంగా నిఖిల్ కి సరైన విన్నింగ్ స్పీచ్ రాలేదని, గౌతమ్ కి సరిగ్గా రెండు నిమిషాలు కూడా మాట్లాడటానికి టైమ్ ఇవ్వకపోవడంతో తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది సెలెబ్రిటీలు స్టేజ్ మీదకి వచ్చినా వారిది ఫైనల్ ఎపిసోడ్ లో తీసేసినట్టుగా తెలయస్తోంది. ఈ సీజన్-8 లో పెద్ద మైనస్ ఏంటంటే.. కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ ఓటింగ్ లో పోటీపడటం.. దీనివల్ల జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగింది. హౌస్ లో ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన అవినాష్.. ప్రతీ గేమ్ లో గెలిచాడు కానీ గౌతమ్ ఇండివిడ్యువల్ గా ఆడుతున్నానంటు ఎక్కువ గొడవలు పెట్టుకోవడం, అతడికి స్క్రీన్ స్పేస్ ఎక్కువవడంతో అవినాష్ కి ఓటింగ్ లేకుండా పోయింది. గ్రాంఢ్ ఫినాలే గ్రాంఢ్ గా లేకపోవడం.. ఒక స్పార్క్ లేకపోవడంతో ఈ సీజన్-8 అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది‌. మరి ఫైనల్ డే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.