English | Telugu

Bigg boss 9 Telugu : మూడో వారం కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్...

బిగ్ బాస్ సీజన్-9 చూస్తుండగానే మూడో వారానికి వచ్చేసింది. సంజన, డీమాన్ పవన్ ఇద్దరు గత రెండు వారాలలో కెప్టెన్ గా చేశారు. అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ ని దివ్య నిఖిత సెలక్ట్ చేసింది. కెప్టెన్సీ కంటెంటెండర్స్ రేసులో.. దివ్య నిఖిత, భరణి, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజ అయిదుగురు ఉన్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే కంటెండర్స్ వేసుకున్న టీ షర్ట్ కి మిగతా వాళ్ళు విసురుతున్న బాల్స్ స్టిక్ అవుతాయి.

బజర్ మోగే టైమ్ కి ఎవరి టీ షర్ట్ మీద అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు టాస్క్ నుండి ఎగ్జిట్ అవుతారు. టాస్క్ కి సంఛాలక్ గా పవన్ కళ్యాణ్ ఉంటాడు. మొదటగా టాస్క్ నుండి దివ్య ఎగ్జిట్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, తర్వత తనూజ ఎగ్జిట్ అవ్వగా.. చివరికి భరణి, ఇమ్మాన్యుయల్ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ జరుగగా టాస్క్ లో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ మూడో వారం కెప్టెన్ అవుతాడు. ఇక డీమాన్ పవన్ కెప్టెన్సీ బ్యాండ్ ని ఇమ్మాన్యుయల్ కి పెడుతాడు.

కెప్టెన్ అయ్యానంటే అందరి సపోర్ట్ వళ్లేనని ఇమ్మాన్యుయల్ అంటాడు. టాస్క్ ఎలాంటి గొడవ లేకుండా జరిగింది. ఇమ్మాన్యుయల్ ఫెయిర్ గా కెప్టెన్ అయ్యాడు. బాల్స్ ఎక్కువగా నన్ను టార్గెట్ చేసి విసిరారని భరణి ఫీల్ అవుతాడు. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ కి ఎక్కువ బాల్స్ విసర్లేదు. హౌస్ లో అందరికి పాజిటివ్ గా ఉన్న పర్సన్ ఇమ్మాన్యుయల్ అందుకే కంటెస్టెంట్స్ భరణిని టార్గెట్ చేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.