English | Telugu

స్టార్ యాంకర్ తో మంతనాలు చేస్తున్న బిగ్ బాస్..నెక్స్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని..

బిగ్ బాస్ సీజన్ 6 మంచి రేటింగ్ రాకపోవడం, విమర్శలు ఎదుర్కోవడం వంటి వాటి కారణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2017 లో స్టార్ట్ ఐన ఈ షో ఎంతో సక్సెస్ అయ్యింది. ఐతే బిగ్ బాస్ సీజన్- 6 అందుకు భిన్నంగా చాలా నిరుత్సాహపరిచింది.

ఈ సీజన్ లో ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రలోభాల కారణంగా నిజాయితీగా ఆడిన కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఇక వీటన్నిటి వలన నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి రానా దగ్గుబాటిని హోస్ట్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కొన్ని రోజుల నుంచి ఈ న్యూస్ ఇలా వైరల్ అవుతుంటే ఇప్పుడు మరో న్యూస్ తెర మీదకు వచ్చింది. అదే బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్, ప్రస్తుత స్టార్ యాంకర్ శ్రీముఖిని కలిశారంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

బిగ్ బాస్ మేకర్స్ ఎలాగైనా సీజన్ 7 కి గ్రాండ్ సక్సెస్ చేయాలనే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హోస్ట్స్ వేట చాలా స్పీడప్ చేశారు. ఇకపోతే వచ్చే ఏడాది జులైలో ఈ సీజన్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.