English | Telugu

సోహైల్‌ని టార్చర్ చేసిన అమ్మాయి... రంగంలోకి దిగిన పోలీసులు!


ఒక అమ్మాయి మూడేళ్ళ పాటు పెట్టిన టార్చర్ తో ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చాడు సోహైల్. ఆ అమ్మాయి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సోహైల్. "లక్కీ లక్ష్మణ్ మూవీ టైములో ఫ్యాన్ అంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఫోటో దిగింది వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఐతే ఒకసారి అఖిల్ నా ఫోన్ నంబర్ లీక్ చేసేసాడు. అలా కొంతమంది నా నంబర్ తెలిసింది. ఈ అమ్మాయి నా నంబర్ తెలుసుకుని ఫోన్ లు చేయడం స్టార్ట్ చేసింది. ఫ్రాంక్ గా మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాను. తర్వాత ఇంటికి వచ్చేసింది. బొకేలు తీసుకుని రావడం స్టార్ట్ చేసింది. వచ్చి హగ్ అని కిస్ అని ఏంటో అంటది. పోలీస్ స్టేషన్ లో రెండు సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆరియానా ప్రొఫైల్ లో పిచ్చి పిచ్చి మెసేజ్ లు పెడుతుంది. సైకలాజికల్ గా ఏదన్నా ప్రాబ్లమ్ ఉందేమో ఇంటికి చాలా సార్లు వచ్చేసరికి మా అమ్మ టెన్షన్ పడింది. పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చి పంపించారు. హరాస్మెంట్ అనేది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. ఆమె పెట్టిన మెసేజ్ ఘోరంగా దారుణంగా ఉంటాయి. టార్చర్ అనే పేరుతో ఆమె నంబర్ ని ఫీడ్ చేసాను. చాలా నంబర్ లు బ్లాక్ చేశా. ఫైనల్ గా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశా. ఇక తట్టుకోలేక అక్క అంటూ రిప్లై ఇచ్చా. అక్కా అన్నా కూడా ఆమెకు సిగ్గు రాలేదు. స్వీట్స్ పట్టుకుని, కొన్ని సార్లు డ్రెస్సులు పట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది. ఆ డ్రెస్ లు మా చెఫ్ లకు ఇచ్చేస్తుంటా. ఫైనల్ పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మాట్లాడారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. మూడేళ్లు పడ్డాను ఈమెతో టార్చర్. ఈమె మదర్ తో మాట్లాడాను. ఆవిడకు హెల్త్ బాగున్నట్టు లేదు. ఐనా ఈమె చేసిన పాపానికి తల్లుల మీద ఎం అరుస్తాం. పోలీసులు వచ్చి ఆమెను జీప్ లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ సమాజం కూడా అమ్మాయి మాటనే వింటుంది కానీ అబ్బాయి మాటను వినదు."

Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.