English | Telugu

పూజ మూర్తి ఇంట విషాదం... బిగ్ బాస్ షో క్యాన్సిల్!

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. ఆదివారం సాయంత్రం కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో లాంఛ్ కాబోతోంది. ఐతే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ ఐన ఈ టైములో అనుకోకుండా ఒక హౌస్ మేట్ ఎంట్రీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరుకు చెందిన పూజా మూర్తి మనకు బాగా తెలిసిన నటి. తెలుగు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కన్నడ సీరియల్స్ లో నటించిన తర్వాత తెలుగులో "గుండమ్మ కథ" అనే సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ సీరియల్ కు మంచి టీఆర్పీ కూడా వచ్చింది. ఇక యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన "సూపర్ క్వీన్" ప్రోగ్రామ్ లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. ఐతే ఈమెను బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవాలని నిర్వాహకులు అనుకున్నారు అంతా కరెక్ట్ గా సెట్ అయ్యింది అనుకున్న టైంలో వాళ్ళ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

బిగ్ బాస్ షో కోసం డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అంతా బాగుందనుకుకున్న సమయంలో చివరి నిముషంలో పూజ మూర్తి తండ్రి మరణించినట్లుగా న్యూస్ వచ్చేసరికి ఆమె షో క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్టు పెట్టింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి... తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. "మీరు నా పక్కన లేరనే బాధను ప్రతి సెకను ఫీల్ అవుతున్నాను.. మిమ్మల్ని ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాను.. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను.. తెలిసి తెలియక చేసిన ఏదైనా పొరపాటు చేసి ఉంటే సారీ.. మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు.. మీ ఆశీస్సులు నాతోనే ఉంటాయి... నా మీద... అమ్మ మీద మీ ఆశీస్సులు నిరంతరం ఉంటాయి... రెస్ట్ ఇన్ పీస్ డాడీ" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.