English | Telugu

Bigg boss 9 Telugu: సుమన్ శెట్టి కోసం ఆ బాక్స్ ని రివీల్ చేసిన భరణి.. అందులో ఏం ఉందంటే!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే మూడో వారానికి వచ్చేసింది. హౌస్ లో ఫ్యామిలీ నుండి వచ్చిన సర్ ప్రైజెస్ ని కంటెస్టెంట్స్ కి అందిస్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు. ఇక తనూజ వంతు రాగా తను వాళ్ళ అమ్మ దగ్గర నుండి లెటర్ తీసుకుంటుంది. బ్యాటరీ బోర్డులో పది శాతం మాత్రమే ఉంటుంది సుమన్ శెట్టికి అవకాశం వస్తుంది. సుమన్ కన్ఫెషన్ రూమ్ కి వెళ్తాడు.

ఆ తర్వాత నీకు బ్యాటరీ శాతం పెరగాలంటే భరణి దగ్గరున్న గిఫ్ట్ బాక్స్ రీవీల్ చెయ్యాడానికి అతన్ని కన్విన్స్ చెయ్యాలి. అప్పుడు బ్యాటరీ శాతం పెరుగుతుంది. నీకు మూడు ఆప్షన్స్.. ఫ్యామిలీ ఫోటో, లెటర్, మీ వైఫ్ నుండి వాయిస్ మెసేజ్ అని బిగ్ బాస్ చెప్తాడు. భరణి దగ్గరికి సుమన్ వెళ్లి విషయం చెప్తాడు. దాంతో భరణి ఒకే అంటాడు. మంచి సందర్బం చూసుకొని అందరి ముందు రివీల్ చెయ్యాలనుకున్నాను కానీ సుమన్ కి యూజ్ అవుతుంది అంటే హ్యాపీగా ఓపెన్ చేస్తానని బాక్స్ ఓపెన్ చేస్తాడు.

అందులో చైన్, ఒక లాకెట్ ఉంటుంది. లాకెట్ కి ఒక సైడ్ మా అమ్మ.. ఇంకొరు మా గురువు.‌ మీరు అంటున్నారు కదా నేను సైలెంట్ గా ఉంటున్నానని వాళ్లకు మాటిచ్చాను కాబట్టి సైలెంట్ గా ఉంటున్నానని భరణి చెప్తాడు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ రోజు ఆ బాక్స్ హౌస్ లోకి తీసుకొని వెళ్ళడానికి భరణికి బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వలేదు. అలా అయితే నేను హౌస్ లోకి వెళ్లనని భరణి చెప్తాడు. కాసేపటికి బిగ్ బాస్ ఒకే చెప్తాడు. కానీ ఇప్పుడు సుమన్ వల్ల రీవీల్ చేసాడు భరణి. సుమన్ శెట్టికి వాళ్ళ నాన్న ఫోటో వస్తుంది. మళ్ళీ బ్యాటరీ పది శాతం అవుతుంది. ఇంతటితో ఈ ప్రక్రియ పూర్తి అయిందని బిగ్ బాస్ చెప్పగానే సంజన బాధపడుతుంది. ఇంకా హౌస్ లో ఎవరెవరికి సర్ ప్రైజెస్ వస్తాయో చూడాలి మరి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.