English | Telugu

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్-9 లో ట్విస్ట్.. కంటెస్టెంట్స్ కి బిగ్ షాక్!

బిగ్ బాస్ సీజన్-9 (Bigg boss 9 Telugu) రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ ఈ సారి చదరంగం కాదు రణరంగమన్నట్లు దూసుకుపోతుంది. ఈ సీజన్ లో అగ్నిపరీక్ష ద్వారా ఆరుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాల్లో ఒకరు సెలబ్రిటీ, ఇంకొకరు కామన్ మ్యాన్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

ప్రస్తుతం హౌస్ లో అయిదుగురు కామనర్స్ ఉన్నారు అయితే బిగ్ బాస్ ఈ వీక్ లో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేయబోతున్నాడు. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన దివ్య నిఖిత, షకీబ్, నాగ ప్రశాంత్ ముగ్గురిని మిడ్ వీక్ లో హౌస్ లోకి పంపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ ముగ్గురిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారు. ముగ్గురికి టాస్క్ లు పెట్టి ఎవరైతే విన్ అవుతారో వారిని హౌస్ లోకి పంపిస్తారంట. దాంతో పాటు హౌస్ లో ఉన్న వాళ్ళని ఓటింగ్ చేయమని వాటిని కూడా కన్సిడర్ చేసి హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ ని తీసుకొస్తున్నారంట. అయితే ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అని మిగతా ఇద్దరిని హౌస్ నుండి ఎగ్జిట్ చేస్తారంట. ఇలా నెక్స్ట్ మిడ్ వీక్ కూడా మరొక ముగ్గురిని పంపించి టాస్క్ లు పెట్టి, ఒకరిని పర్మినెంట్ హౌస్ మేట్ చేసే ప్లాన్ లో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వారం కూడా ఒక కామనర్ బయటకు వస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఏ ఓటింగ్ పోల్ చూసిన కామనర్స్ లీస్ట్ లో ఉన్నారు. ఇక అయిదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందనే తెలుస్తోంది. అయిదో వారం నుండి హౌస్ లో మళ్ళీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ వార్ నడుస్తుదన్నమాట.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.