English | Telugu

Bigg boss 9 Telugu : మూడు టీమ్ ల మధ్య రోల్ ది డైస్.. నామినేషన్లో ఉందెవరు!


బిగ్ బాస్ సీజన్-9 అప్పుడే నాలుగో వారానికి వచ్చేసింది. నాలుగో వారానికి సంబంధించినది నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతుంది. ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. సుమన్ శెట్టి, భరణి, తనూజ, పవన్ కళ్యాణ్.. నలుగురిని టీమ్ లీడర్స్ గా బిగ్ బాస్ సెలక్ట్ చేస్తాడు.

ఒక్కో టీమ్ కి ముగ్గురు సభ్యులు లు ఉంటారు. సుమన్, రాము, ఫ్లోరా ముగ్గురు ఎల్లో టీమ్.. తనూజ, రీతూ, దివ్య బ్లూ టీమ్.. హరీష్, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ రెడ్ టీమ్, భరణి, సంజన శ్రీజ గ్రీన్ టీమ్ గా ఉన్నారు. సంఛాలక్ గా డీమాన్ పవన్ ఉన్నాడు. టాస్క్ లో గెలిచిన వారికి నామినేషన్ చేసే ఛాన్స్ వస్తుంది. బిగ్ బాస్ ఆదేశానుసరం బజర్ వస్తుంది. అప్పుడు డీమాన్ పవన్ డైస్ రోల్ చేస్తాడు. మొదటగా తనూజకి ఛాన్స్ వస్తుంది. తను సుమన్ శెట్టి టీమ్ ని టాస్క్ ఆడడానికి సెలక్ట్ చేసుకుంటుంది. కానీ ఆ టాస్క్ సుమన్ శెట్టి టీమ్ గెలిచి. తనూజ టీమ్ లోని రీతూని నామినేట్ చేస్తారు. ఆ తర్వాత భరణికి ఛాన్స్ రాగా.. అతను కూడా ఎల్లో టీమ్ అయినా సుమన్ ని సెలక్ట్ చేసుకుంటాడు అందులో భరణి గెలుస్తాడు .ఆ టీమ్ ఎల్లో టీమ్ లోని ఫ్లోరాని నామినేట్ చేస్తారు.

ఆ తర్వాత మళ్ళీ భరణికి ఛాన్స్ రాగా.. సుమన్ శెట్టి టీమ్ ని సెలక్ట్ చేసుకుంటాడు. తర్వాత సుమన్ శెట్టి టీమ్ గెలవగా సంజనని నామినేషన్ చేస్తారు. ఆ తర్వాత తనూజ టీమ్ కి ఛాన్స్ రాగా గ్రీన్ టీమ్ లోని శ్రీజని నామినేషన్ చేస్తారు.ఆ తర్వాత సుమన్ శెట్టి టీమ్ ఎల్లో టీమ్ కి ఛాన్స్ వస్తుంది. దాంతో హరీష్ ని నామినేషన్ చేస్తారు. ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి కాలేదు ఎవరు నామినేషన్ లో ఉన్నారని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.