English | Telugu

Bigboss telugu 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సెలెక్ట్ అయిన పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్(బిగ్ బాస్ సీజన్-9) ప్రారంభం కానుంది. దాంతో ఈ సీజన్ పై రోజురోజుకి క్యూరియాసిటి పెరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం పదిహేను మంది కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అందులో దాదాపు జనాలకి పెద్దగా తెలియని వాళ్ళే ఉన్నారు. ఈ పదిహేను మందిలో సగం మంది అగ్ని పరీక్షలో విన్ అయితే డైరెక్ట్ హౌస్ లోకి ఎంట్రీ టికెట్ వస్తుంది.

మరోవైపు సెలబ్రిటీలు ఎంత మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న.. ఈ సీజన్ అంతా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. ఉంటే అది ఎలా ప్లాన్ చేసారో.. లేకపోతే ఏం చేస్తారో అని ఇలా బిగ్ బాస్ మొదలు నుండి ముగిసే వరకు ఎవరి ఊహాగానాలు వాళ్ళవి.. అయితే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి పదిహేను మంది ఎంపికయ్యారు. అనూష రత్నం, దివ్య నిఖిత, శ్రేయ, శ్వేతా శెట్టి, డిమాన్ పవన్, ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ, మిస్ తెలంగాణ కల్కి, లాయర్ ప్రశాంత్, దాహిళా షరీఫ్, మాస్క్ మ్యాన్ హృదయ్, పవన్ కళ్యాణ్, మార్దయ మదన్, ప్రియ శెట్టి, ఇన్ ఫ్లూయెన్సర్ షకీర్ అగ్నిపరీక్షకి సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది.

ఈ అగ్నిపరీక్షలో విన్ అయ్యి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరో తెలియాలంటే కొద్దీరోజులు ఆగాల్సిందే. ఈ పదిహేను మంది కూడా యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో కొంత ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఈ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎవరు సెలబ్రిటీగా మారుతారో చూడాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.