English | Telugu

Bigboss telugu 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సెలెక్ట్ అయిన పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్(బిగ్ బాస్ సీజన్-9) ప్రారంభం కానుంది. దాంతో ఈ సీజన్ పై రోజురోజుకి క్యూరియాసిటి పెరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం పదిహేను మంది కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అందులో దాదాపు జనాలకి పెద్దగా తెలియని వాళ్ళే ఉన్నారు. ఈ పదిహేను మందిలో సగం మంది అగ్ని పరీక్షలో విన్ అయితే డైరెక్ట్ హౌస్ లోకి ఎంట్రీ టికెట్ వస్తుంది.

మరోవైపు సెలబ్రిటీలు ఎంత మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న.. ఈ సీజన్ అంతా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. ఉంటే అది ఎలా ప్లాన్ చేసారో.. లేకపోతే ఏం చేస్తారో అని ఇలా బిగ్ బాస్ మొదలు నుండి ముగిసే వరకు ఎవరి ఊహాగానాలు వాళ్ళవి.. అయితే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి పదిహేను మంది ఎంపికయ్యారు. అనూష రత్నం, దివ్య నిఖిత, శ్రేయ, శ్వేతా శెట్టి, డిమాన్ పవన్, ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ, మిస్ తెలంగాణ కల్కి, లాయర్ ప్రశాంత్, దాహిళా షరీఫ్, మాస్క్ మ్యాన్ హృదయ్, పవన్ కళ్యాణ్, మార్దయ మదన్, ప్రియ శెట్టి, ఇన్ ఫ్లూయెన్సర్ షకీర్ అగ్నిపరీక్షకి సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది.

ఈ అగ్నిపరీక్షలో విన్ అయ్యి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరో తెలియాలంటే కొద్దీరోజులు ఆగాల్సిందే. ఈ పదిహేను మంది కూడా యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో కొంత ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఈ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎవరు సెలబ్రిటీగా మారుతారో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.