English | Telugu

శివాజీ టార్గెట్ అమర్ దీప్.. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అదుర్స్!!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఇప్పటికే రసవత్తరంగా సాగుతోంది. సోమవారం నాటి నామినేషన్లతో బిగ్‌బాస్‌ హౌజ్‌ హీటెక్కింది. ఇప్పటికె రెండు వారాలు పూర్తి చేసుకొని మూడవ వారంలోకి అడుగుపెట్టారు కంటెస్టెంట్స్‌. కాగా, అందులో ఆట సందీప్‌, శివాజీ ఇద్దరూ పవరస్త్రని సాధించి కన్‌ఫర్మ్‌ హౌజ్‌ మేట్స్‌గా నిలిచారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ నుంచి మొదటివారం కిరణ్‌ రాథోడ్‌, రెండోవారం షకీలా ఎలిమినేట్‌ అయ్యారు.

కాగా, మూడవవారం హౌజ్‌ నుండి ఎవరు బయటకెళ్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సీరియల్‌ బ్యాచ్‌ అంతా మళ్లీ ఒక్కటయ్యారు. అదే ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌, శోభా శెట్టి ఒకరికొకరు నామినేట్‌ చేసుకోకుండా వేరే కంటెస్టెంట్స్‌ని నామినేట్‌ చేశారు. ప్రిన్స్‌ యావర్‌ని దామిని నామినేట్‌ చేసింది. సిల్లీ రీజన్‌ చెప్పడంతో యావర్‌ నామినేషన్‌ని యాక్సెప్ట్‌ చేయలేకపోయాడు. ‘ఆరోజు గౌతమ్‌కృష్ణకి, నీకు మధ్య జరిగిన గొడవలో నువ్వు అంత డ్రామా క్రియేట్‌ చేయనవసరం లేదు’ అంది దామిని. దాంతో యావర్‌ రెచ్చిపోయాడు. ‘అలా ఎలా మాట్లాడతావ్‌? నీ మాటలు వెనక్కి తీసుకో’ అని దామినిని అడిగాడు యావర్‌. ‘నేను తీసుకోను’ అంది దామిని. ఇలా ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది.

ఆ తర్వాత ప్రియాంక జైన్‌ని శుభశ్రీ నామినేట్‌ చేసింది. దాన్ని ప్రియాంక యాక్సెప్ట్‌ చెయ్యలేదు. కుకింగ్‌ విషయంలో వీళ్ళిద్దరి మధ్య మరింత మాటల యుద్ధం జరిగింది. ఇక నామినేషన్లు అందరూ చేశాక, బిగ్‌ బాస్‌ ఉల్టా పల్టా చేశాడు. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ నుంచి ఒకరిని నామినేషన్‌లోకి తీసుకురావాలంటూ, నామినేషన్‌లో ఉన్న ఒకరిని సేవ్‌ చేయాలంటూ సేఫ్‌ జోన్‌లో ఉన్న ఆట సందీప్‌, శివాజీలకి బిగ్‌ బాస్‌ చెప్పాడు. ఇద్దరూ చాలాసేపు డిస్కస్‌ చేసుకొని అమర్‌దీప్‌ని నామినేట్‌ చేశారు. దాంతో అమర్‌దీప్‌ ఫుల్‌ ప్రస్ట్రేట్‌ అయ్యాడు. శివాజీ తనపట్ల పక్షపాతం చూపించాడంటూ అతనితో వాగ్వాదానికి దిగాడు అమర్‌దీప్‌. దీంతో అమర్‌దీప్‌కి నెగెటివ్‌ పెరిగింది. ఈసారి నామినేషన్‌లో జరిగే ఓటింగ్‌లో చివరి స్థానంలో అమర్‌దీప్‌ ఉంటాడని తెలుస్తోంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.