English | Telugu

బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ అప్డేట్!

బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. నిజానికి మే నెలలో ఈ షోను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే షోని చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు.

ఇక ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో బిగ్ బాస్ షోను జూలైలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సెలబ్రిటీల లిస్ట్ కూడా రెడీ చేశారట. ఇప్పుడు వాళ్లకు జూమ్ వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని సమాచారం. రోజుకి ముగ్గురు చొప్పున 'మా' యాజమాన్యం కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూలు చేస్తుందట.

మరో వారం రోజుల్లో ఫైనల్ లిస్ట్ ను రెడీ చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందుకు కంటెస్టెంట్ లందరినీ హోమ్ క్వారెంటైన్ కు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి రెండు వారాల ముందుగానే ఈ ప్రాసెస్ ను మొదలుపెట్టాలి. ఈసారి ప్రైజ్ మనీను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మూడు, నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున ఐదో సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.