English | Telugu

గడ్డం తీస్తేనే మూవీ రోల్ ఇస్తానన్న రామ్ చరణ్...అల్లు అర్జున్ తో నటిస్తా

బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్, పృద్వి ఇద్దరి మేల్ జోడి అద్భుతంగా ఉంటుంది. నిఖిల్ నల్ల కళ్లజోడుతో, పృద్వి గడ్డంతో వెనక జుట్టుతో కళ్లజోడుతో ఉంటాడు. వీళ్ళను కే బ్యాచ్ అని పిలుస్తారు. ఇక వీళ్లద్దరి ఫ్రెండ్ షిప్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. ఐతే వీళ్ళు ఒక షో ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో పృద్వి శెట్టి గురించి ఒక విషయం లీకైంది. "గడ్డం తీస్తేనే మూవీలో రోల్ ఇస్తానని రామ్ చరణ్ అంటే రోల్ ఏంటి అని అడిగావట ఏంటి" అంటూ హోస్ట్ తేజస్విని మాదివాడ అడిగేసరికి నవ్వేసాడు. దానికి నువ్వు నిజంగానే హీరో లాగా ఉన్నావ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది తేజస్విని. "నాకు ఇండస్ట్రీ మీద ఇంటరెస్ట్ రావడానికి కారణం నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ " అని చెప్పుకొచ్చాడు పృద్వి శెట్టి. తర్వాత నిఖిల్ ని అడిగింది .."ఎవరితోనైనా డేట్ చేయాలనుకుంటున్నావా" అని. "లేదు " అన్నాడు. "ప్యాచప్ లేదా బ్రేకప్" అని ఇంకో క్వశ్చన్ అడిగింది. ప్యాచప్ అని నిఖిల్ ఆన్సర్ ఇచ్చేసరికి ఎవరితో ప్యాచప్ చెప్పు అంటూ ఆతృతగా అడిగింది. 'హే వద్దులే ...నేను స్క్రాచ్ లోంచి వచ్చాను ఇప్పుడు ఇలా కాన్ఫిడెంట్ తో ఉన్నా. ఒకవేళా మళ్ళీ స్క్రాచ్ లో పడాల్సి వచ్చినా ఎలా లేవాలో నాకు బాగా తెలుసు..సరే నన్ను ఎవరైనా బ్లేమ్ చేస్తూ ఉంటూ వదిలేస్తా" అన్నాడు నిఖిల్. నిఖిల్ కి కావ్యకి మధ్య ఎం జరిగిందో అసలు విషయం తెలీదు కానీ ఇద్దరికీ షోస్ లో బాగా కోల్డ్ వార్ జరుగుతోంది. " నేను బిగ్ స్క్రీన్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటే అల్లు అర్జున్ తో షేర్ చేసుకుంటా" అని చెప్పాడు నిఖిల్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.