English | Telugu

బలగం 3 కానీ 4 కానీ ధనరాజ్ ని పెట్టి చేస్తా

నెక్స్ట్ వీక్ ఆలీ తో సరదాగా షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి బలగం వేణు, ధనాధన్ ధనరాజ్ వచ్చారు. ఇక ఆలీ రకరకాల ప్రశ్నలు అడిగాడు.. "ఫస్ట్ యాక్టర్ గా 2003 , డైరెక్టర్ గా 2023 . మూడు బాగా కలిసొచ్చింది కానీ అది కలిసిరావడానికి 20 ఏళ్ళు పట్టింది" అన్నాడు బలగం వేణు. "నాకంటే పెద్ద రాజానా" అని ధనరాజ్ ని అడిగేసరికి "మీరు పెద్ద రాజా ఐతే ధన్ రాజ్ కాట్రాజ్" అన్నాడు వేణు. "సరిగ్గా నటించకపోయినా, మాట వినకపోయినా కొట్టేవాడాయన " అని ఆలీ అనేసరికి "ఆయన చేతి రుచి తగిలివాళ్ళంతా స్టార్స్ ఇపోయారు..నాకు తగల్లేదు ధనరాజ్ కి తగల్లేదు..కొంచెం లేట్ అయ్యింది" అన్నాడు వేణు. "బలగంలో నువ్వు నటించావా" అని అడిగాడు ఆలీ "లేదు నటించలేదు" అన్నాడు ధనరాజ్. "మరి క్లోజ్ ఫ్రెండ్ అన్నావ్ గా వేణుని" అని ఆలీ అడిగాడు. "బలగం 3 కానీ 4 కానీ ధనరాజ్ ని పెట్టి చేస్తా" అన్నాడు వేణు.

"బలగం మూవీ తీద్దామనుకున్నప్పుడు ఒక టెక్నిషియన్ వచ్చి పెద్ద బాహుబలి అన్నట్టు ఫీలవుతున్నావ్ అన్నాడు. తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక మీరు అన్నారు చిన్న సినిమాల్లో ఈ మూవీ బాహుబలి అని" అన్నాడు వేణు. చివరిలో వేణు గోచీ పెట్టుకుని ధ్యానం చేస్తున్న పిక్ చూపించి "ఏంటి గోచి బాబానా" అని ఆలీ అడిగాడు "అది మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు తీసిన ఫోటో" అన్నాడు వేణు. "అంటే డైరెక్టర్స్ కి ఈ ఫోటోనే చూపించావా" అన్నాడు ఆలీ. "ఏంటి ధనరాజ్ పెళ్లికి ముందు కనిపించినవాళ్లందరినీ లవ్ చేసేసావంటా" అని అడిగేసరికి "పెళ్ళికి ముందు అన్నారేంటి పెళ్ళికి తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది" అంటూ ధనరాజ్ గురించి చెప్పాడు వేణు. ఇలా ఈ వారం ఎపిసోడ్ వీళ్ళతో రాబోతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.